హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చేవారి సంఖ్య భారీగా పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ఏర్పాడిన తర్వాత సర్కారు దవాఖానలను ఎంతో అభివృద్ధి చేశామన్నారు. హైదరాబాద్ అమీర్పేటలోని 50 పడకల దవాఖానకు దాతల సహకారంతో ఫ్రిజ్లు, ఏసీలు, ఫర్నిచర్ను అందజేశారు. ఈ సందర్భంగాపేద ప్రజల కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చిన దాతలను మంత్రి తలసాని అభినందించారు.
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా హాస్పిటల్ను 100 పడకలకు పెంచేందుకు కృషి చేస్తానని హామీఇచ్చారు. రాష్ట్రంలోని సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వేలాది రూపాయల విలువైన వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.