బన్సీలాల్పేట్, ఏప్రిల్ 2 : ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. సనత్నగర్ను అభివృద్ధిలో నంబర్వన్గా తీర్చిదిద్దాం.. మీకు సేవ చేయడానికే మేమున్నాం.. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని బన్సీలాల్పేట్లోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముందుగా బన్సీలాల్పేట్ క మాన్ వద్ద నుంచి బ్యాండు మేళాలతో, గులాబీరంగు పూలు చల్లుతూ ఘ నంగా స్వాగతం పలికారు. కారుపై నుంచి మంత్రి తలసాని ప్రజలకు అభివాదం చేశారు. బీజేఅర్ నగర్ వద్ద అంబేద్కర్, జగ్జీవన్రామ్ జంట విగ్రహాల వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను మంత్రి తలసాని ఎగురవేశారు. బన్సీలాల్పేట్లో జరిగిన అభివృద్ధి పనులపై రూపొందించిన ఫొటో ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు.
అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ 75 ఏండ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎనిమిదేండ్లుగా జరుగుతున్నాయని, పేదల కోసం అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. నిరంతరం పేదల కోసం ఆలోచించే గొప్ప మనసున్న సీఎం కేసీఆర్ తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి పథంలో దేశానికే ఆదర్శంగా మారుస్తున్నారన్నారు. చాచానెహ్రూనగర్, బండమైసమ్మనగర్, పొట్టిశ్రీరాములు నగర్, జీవైఆర్ కాలనీలో గతంలో గుడిసెలు, రేకుల ఇండ్లలో కనీస సదుపాయాలు లేకుండా జీవించేవారని, అలాంటి పేదలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తిగా ప్రభుత్వమే అన్ని భరించి, సకల సదుపాయాలతో అద్భుతమైన కాలనీలను నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు ప్రజల సమక్షంలో అందజేశామన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ఉన్న మాదిరిగా బన్సీలాల్పేట్లో కూడా అద్భుతమైన సిమెంట్ రోడ్లను ఏర్పాటు చేశామన్నారు.
వివాహాది శుభకార్యాల కోసం ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లలో లక్ష రూపాయల అద్ద్దె చెల్లించలేక బాధపడుతున్న పేదప్రజల కోసం సకల సదుపాయాలతో మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు నిర్మించి కేవలం పదహారు వేల రూపాయలకే అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. గతంలో కేవలం రూ.200 ఇచ్చిన పింఛన్లను రూ.2016కి పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. నెలనెలా పింఛన్ అందుకుంటున్న వితంతువులు, వృద్ధుల ముఖాల్లో ఆనందం కనిపిస్తున్నదని, అందుకు కారణం మీ ఎదురుగా ఫొటోలో కనిపిస్తున్న సీఎం కేసీఆరేనని చూపించారు. బన్సీలాల్పేట్లో శిథిలావస్థకు చేరిన చారిత్రాత్మక మెట్లబావిని అభివృద్ధి పరిచి, అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చి, అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. పేదలకు వైద్య సేవలు అందించడానికి డివిజన్లో మూడు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశామన్నారు. గాంధీ దవాఖానకు ప్రభుత్వం వంద కోట్లు కేటాయించిందని, వాటి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభిస్తున్నాయన్నారు.
కరోనా సమయంలో వేలాది మందికి గాంధీ దవాఖాన వైద్యులు పునర్జన్మ అందించారని తెలిపారు. ఆడపిల్లల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని అన్నారు. దళితులు అధికంగా నివసించే బన్సీలాల్పేట్ డివిజన్లో దళిత బంధు పథకం ద్వారా అనేక మందికి లబ్ధి చేకూరిందన్నారు. మన బస్తీ-మన బడి పథకం ద్వారా డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరిచామన్నారు. బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్ హేమలత లక్ష్మీపతి, సనత్నగర్ కార్పొరేటర్ కోలన్ లక్ష్మీబాల్రెడ్డి, బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, రాంగోపాల్పేట్ మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ డివిజన్ ఇన్చార్జి పవన్కుమార్ గౌడ్, అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, ప్రధాన కార్యదర్శులు మహేందర్, రాజేందర్ పాల్గొన్నారు.
బన్సీలాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ హేమలత లక్ష్మీపతి మాట్లాడుతూ డివిజన్లో ఎనిమిదేండ్లలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటే ఇక్కడి ప్రజలకు ఎంతో అభిమానమన్నారు. ప్రతి బస్తీలో ఆలయాలను తన స్వంత ఖర్చులతో నిర్మించారని తెలిపారు. ప్రజల ఆదరాభిమానాలు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే తమకు బలమన్నారు. బీఆర్ఎస్ నాయకులు తలసాని మహేశ్ యాదవ్, తలసాని రవీందర్ (స్కైలాబ్) యాదవ్, లక్ష్మీపతి, ఏసూరి మహేశ్, కమల్కుమార్, ప్రేమ్కుమార్, రజాక్, ఫహీమ్, అబ్బాస్, జావేద్, శాహెద్, కేఎం.కృష్ణ, దేశపాక శ్రీను, విజయ్శంకర్, శాంతికుమార్, నర్సింగ్రావు, శ్రీలక్ష్మి, సంధ్యారాణి, నాగలక్ష్మి, అమృత, ఉష, దుర్గ, కౌసల్య, లావణ్య, విజయ, సాయి, చిన్నా, రంజిత్ పాల్గొన్నారు.