సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) ; హైదరాబాద్ నగర ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రకటించారు. సోమవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో వచ్చే నెల 19 నుంచి 28 వరకు నిర్వహించే గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే మట్టి విగ్రహాల పంపిణీ చేస్తామన్నారు. విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి, శోభాయాత్రకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉత్సవ సమితి నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు అటవీ శాఖ సహకారంతో వినాయకుడికి కావాల్సిన 21 రకాల పత్రిని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అదేవిధంగా విగ్రహాల నిమజ్జనానికి తీసుకెళ్లే వాహనాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని మంత్రి తలసాని తెలిపారు.
వచ్చే నెలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యం లో అన్ని ఏర్పాట్లు చేయనున్నట్టు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించా రు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో వచ్చే నెల 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై హోంమంత్రి మహమూద్ అలీ, మం త్రి మల్లారెడ్డిలతో సోమవారం కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సురభి వాణీదేవి, ఎమ్మెల్యే దానం నాగేంద ర్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమా ర్, ట్రాన్స్ పోర్ట్ సెక్రెటరీ శ్రీనివాస రాజు, వాటర్ వర్స్ ఎండీ దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, టీఎస్ ఎస్సీడీఎల్ ఎండీ రఘుమారెడ్డి, లా అండ్ ఆర్డర్ ఏడీజీ సంజయ్ జైన్, హెల్త్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ అమర్ సింగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, హరీష్, అమయ్ కు మార్, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, ఇరిగేషన్ సీఈ ధర్మా, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి భగవంతరావు, బాలాపూర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వైఎంసీఏ గణేష్ ఉత్సవ కమిటీలతో పాటు వివిధ గణేష్ ఉత్సవ మండపాల కమిటీల సభ్యులు రామరాజు, ప్రభాకర్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు సీవీలు ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, కల్చరల్ డైరెక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు.
అన్ని పండగలకు ప్రాధాన్యత
జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో నిర్వహించే గణేష్ నవరాత్రులకు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, అందులోనూ హైదరాబాద్లో నిర్వహించే వేడుకలకు దేశంలోనే అత్యున్నతంగా ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రధానంగా ఖైరతాబాద్లో నిర్వహించే అతి పెద్ద విగ్రహ నిమజ్జనాన్ని లక్షలాది మంది ప్రత్యేకంగా వీక్షిస్తారని చెప్పారు. అదే విధంగా బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర అనంతరమే, మిగతా మండపాల నుంచి శోభాయాత్ర ప్రారంభం అవుతూ వస్తున్నదని చెప్పారు. గడిచిన తొమ్మిదేండ్లలో ప్రతి ఏటా గణేష్ నవరాత్రులతో పాటు బోనాలు, శ్రీరామ నవమి, హనుమా న్ జయంతి, బతుకమ్మ, రంజాన్, బక్రీద్, క్రిస్మస్ పం డుగలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ అన్ని వర్గాల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ వస్తున్న విషయా న్ని గుర్తు చేశారు. నిమజ్జనం కోసం వివిధ చెరువు లు, కొలనులను, లైటింగ్, బందోబస్త్ను జీహెచ్ఎంసీ సిద్ధం చేస్తున్నదన్నారు. అన్ని శాఖల సమన్వయానికి కంట్రోల్ రూమ్ను సైతం ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఎక్కడా అంతరాయం ఏర్పడకుండా…
విద్యుత్ సరఫరాలో ఎకడా అంతరాయం ఏర్పడకుండా చూసేందుకు ప్రత్యేకంగా ట్రాన్స్ ఫార్మర్ల ను అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. అవసరమైన అన్ని ప్రాంతాలలో లైటింగ్ ఏ ర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా నిమజ్జన ప్రాంతాలు, శోభాయాత్ర నిర్వహించే ప్రాంతాలలో భక్తులకు తాగునీటిని అందించేందుకు వాటర్ వర్స్ విభాగం ఆధ్వర్యంలో ప్ర త్యేక కేంద్రాలు, సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. పారిశుధ్య నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ అదనపు సిబ్బందిని నియమించి రౌం డ్ ది క్లాక్ విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తలసాని పేర్కొన్నా రు. ప్రజలకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. చివరి నిమజ్జనం రోజు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. వినాయకుడి పూజకు అవసరమైన 21రకాల పత్రి అందుబాటులో ఉండ టం లేదని, పలువురు ఉత్సవాల నిర్వాహకులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి అటవీ శాఖ అధికారులతో సంప్రదించి పత్రిని సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా విగ్రహాలను నిమజ్జనం కోసం తీసుకెళ్ళే వాహనాలను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నదని మంత్రి తలసాని తెలిపారు.