హైదరాబాద్ : రాష్ట్ర ప్రశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందిరా పార్కు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో మంత్రి తలసాని పాల్గొని స్టెప్పులేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రుతువుల ఆధారంగా వచ్చే పండుగలు మన సంస్కృతిని చాటి చెప్తాయన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఎంతో సంతోషంగా హోలీ జరుపుకోవడం అనాదిగా వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారుని తెలిపారు. ఇందిరా పార్కు వాకర్స్ కోరిక మేరకు స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.