Minister Srinivas Yadav | కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేలు అందిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 38 మంది లబ్ధిదారులకు రూ.17.7లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్యసేవల్లో పెను మార్పులు వచ్చాయన్నారు. పేదలకు ప్రభుత్వ వైద్యం చేరువ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని, లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్లు సైతం ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. వైద్య పరీక్షల కోసం కోట్లాది వ్యయంతో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్కు వచ్చే పేషేంట్స్ తరఫు కుటుంబ సభ్యులకు రూ.5కే భోజనం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు.