సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మార్చే లక్ష్యంతో రానున్న రోజుల్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్లోని ఇన్ఫోసిస్ క్యాంపస్లో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్తో కలిసి పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశమై మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సెయింట్ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, ఇన్ఫోసిస్కు చెందిన రఘు బొడ్డుపల్లి, గూగుల్కు చెందిన అరిజిత్ సర్కర్, టై హైదరాబాద్ ప్రతినిధి మురళి బుక్కపట్నం, టీసీఎస్ ప్రతినిధి వి.రాజన్న, హైసియా ప్రతినిధి ప్రశాంత్ నండూరి, నాస్కాం, ఎస్టీపీఐ, టీవీఎజీఎల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.