దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి సబితారెడ్డి
మహేశ్వరం, జూలై 28: వైద్య రంగానికి తెలంగాణ సర్కారు పెద్ద పీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల కేంద్రంలో నూతనంగా రూ.6కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ దవాఖాన భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం మండల ప్రజలకు ఈ దవాఖాన ఎంతో ఉపయోకరంగా ఉంటుందని ఆమె అన్నారు. 30 పడకల దవాఖాన పనులను మరో మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలని సబితారెడ్డి సూచించారు.
ఇప్పటి వరకు భవన నిర్మాణానికి రెండున్నర కోట్ల నిధులు కాగా మరో మూడున్నర కోట్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, ఎంపీడీవో నర్సింహులు, తహసీల్దార్ ఆర్పీ జ్యోతి, జిల్లా హెల్త్ కోఆర్డినేటర్ జాన్సి, సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్కుమార్, నవీన్ మండల అధ్యక్షుడు రాజునాయక్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చంద్రయ్య, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆధిల్ అలీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ నాయక్ నాయకులు చంద్రయ్య ముదిరాజ్, రవీందర్, నవీన్, కృష్ణ, గోపాల్ నాయక్, అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి
మహేశ్వరంలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఎంపీపీ రఘుమారెడ్డితో కలిసి మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు.
చెరువులను పరిశీలించిన సబితారెడ్డి
బడంగ్పేట,జూలై28: మీర్పేట కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువు, చందన చెరువులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ,డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి,కార్పొరేటర్లు, అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. చెరువు కట్టపై ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహం దగ్గర మంత్రి వాకర్స్తో చర్చగోష్టి నిర్వహించారు. చెరువు కట్టపై మహనీయుల ఫొటోలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాకర్స్ మంత్రికి తెలిపారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నాలాల నిర్మా ణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆమె అధికారులకు సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఈ గోపీనాథ్, కార్పొరేటర్లు భూపాల్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బీరప్ప, నాగేశ్ తదితరులు ఉన్నారు.