మహేశ్వరం, మే 30 : పురాతన కాలం నాటి కోనేరు మెట్ల బావిని రూ.90లక్షలతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరంలోని పురాతన కోనేరు మెట్ల బావిని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పురాతన కట్టడాలను సంరక్షించే విధంగా సీఎం కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారని అన్నారు. బన్సీలాల్పేట్లోని పురాతన మెట్లబావిని నూతన హంగులతో ఆధునీకరించి యువతరానికి సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. అదేవిధంగా మహేశ్వరంలో ప్రసిద్ధి గాంచిన అక్కన్న, మాదన్నల కాలం నుంచి ఉన్న గడీకోటను, మెట్లబావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నామని చెప్పారు.
మహేశ్వరంలోని శివగంగ దేవాలయం, గట్టుపల్లిలో వీరాంజనేయస్వామి దేవాలయం, సేవాలాల్ దేవాలయానికి అడిగిన వెంటనే రూ.కోటి చొప్పున మూడు దేవాలయాలకు రూ.3కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు.వంద రోజుల్లో మహేశ్వరంలోని కోనేరు మెట్ల బావిని ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మల్లేశ్యాదవ్, సర్పంచ్ కరోళ్ల ప్రియాంక రాజేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆనందం, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్, నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, కందిరమేశ్, శివమూర్తి, డైరెక్టర్లు కడమోని ప్రభాకర్, మాదారం ఆంజనేయులు, యూత్ అధ్యక్షుడు దయాల శ్రీను, ఎంపీడీవో నర్సింహులు, ఏఈ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కుర్మల్గూడ రైతుల న్యాయం చేయాలని వినతి
బడంగ్పేట, మే 30 : బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్గూడలోని సర్వే నబంర్ 80/3లో ఉన్న ప్రభుత్వ భూమిలోని 4.23 ఎకరాల్లో 75 ఏండ్ల నుంచి ముద్రమోని ఈదయ్య కుటుంబ సభ్యులు వ్యవసాయం చేసుకుంటున్నారని బీజేపీ నాయకుడు శంకర్ రెడ్డి విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి వివరించారు. మంగళవారం ముద్రమోని ఈదయ్య కుటుంబ సభ్యులు శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. వారికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయ భూమిని వారికి చెందే విధంగా చూడాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. నర్సింహ, కుమార్, శ్రీధర్, రాజు, శివ తదితరులు ఉన్నారు.