కందుకూరు, నవంబర్ 17 : డబ్బు సంచులు నెత్తిన పెట్టుకొని వచ్చినా.. కాంగ్రెస్ అభ్యర్థికి మహేశ్వరంలో ఓటమి తప్పదని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులని.. తాను రియల్ లీడర్నని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని మాదాపూర్, కొలనుగూడ, గుమ్మడవెల్లి, ఆకులమైలారం, మీర్ఖాన్పేట్, బేగరికంచె, అన్నోజిగూడ, కటికపల్లి, గూడూరు గ్రామాల్లో పర్యటించి ప్రసంగించారు.
కష్టాల్లో కనబడని నేతలు నేడు ఇక్కడికి వస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని ఆమె కోరారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల చాలా కీలకమైనవని, ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. మొసలి కన్నీరు కార్చే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో కర్ణాటక మాడల్గా రాష్ట్రంలో అమలు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, చిలకమర్రి నర్సింహ, జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.