బడంగ్పేట, మార్చి5: మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజల మౌలిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం వంగశంకరమ్మ గార్డెన్లో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న కాలనీల ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. నందిహిల్స్లో ఉన్న అరుణాచలం ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి మాట్లాడుతూ కాలనీల్లో ఉన్న వరద ముంపు సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తానని ఆమె అన్నారు. చెరువులు కబ్జా అవుతున్నాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. చెరువులను సుందరీకరణ చేస్తే కబ్జా చేసినట్లు అవుతుందా అని ప్రశ్నించారు.
భవిష్యత్ తరాల కోసం మాత్రమే చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన రహదారులను విస్తరణ చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. కాలనీలలో ఉన్న అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. కాలనీల్లో ఎక్కడైన స్థలం ఉంటే గ్రంథాలయాలను ఏర్పాటు చేయిస్తామన్నారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నామని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ మొక్కను నాటాలన్నారు. జూనియర్ కళాశాల భవనం నిర్మాణం చేస్తుంటే స్థానిక కార్పొరేటర్ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్నారని ఆమె మండి పడ్డారు. కార్యక్రమంలో విక్రంరెడ్డి, కాలనీ వాసులు నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు సిద్ధాల బీరప్ప, అనిల్ కుమార్ , బీఆర్ఎస్ నాయకులు, కాలనీ అసోసియేషన్ నాయకులు తదితరులు ఉన్నారు.
ఆర్కేపురం, మార్చి 5 : మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి సరూర్నగర్ డివిజన్ జేబీ కాలనీ, డాక్టర్స్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా జేబీ కాలనీ వాసులు కాలనీలో కమ్యూనిటీహాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించి నిర్మాణం చేపట్టాలని ,డ్రైనేజీ పైపులైన్ సామర్థ్యం పెంచాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలనీ వాసులు తమ వద్దకు వచ్చి కాలనీల్లోని సమస్యలను వివరించడంతో తానే స్వయంగా కాలనీకి వచ్చి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. విజయపురి కాలనీలో రూ.5కోట్లతో నాలాను అభివృద్ధి చేస్తున్నామన్నారు. డాక్టర్స్ కాలనీలో మహిళ భవనం మార్చి 28వ తేదీ వరకు సాక్షన్ చేస్తానని తెలిపారు. కోర్టు కేసులో ఉన్న స్థలం గురించి త్వరలోనే మాట్లాడుతానని పేర్కొన్నారు.
సరూర్నగర్ జూనియర్ కళాశాలలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, కళాశాల అభివృద్ధికి రూ.2కోట్లు కేటాయించామన్నారు. ఎల్బీనగర్ సర్కిల్ ప్రాంతంలో బాగా రద్దీ ఉందని గతంలో ట్రాఫిక్ సమస్య బాగా ఉండేందని, మంత్రి కేటీఆర్ చొరవతో ైఫ్లైఓవర్లు, అండర్పాస్ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య తగ్గిందని ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలని తెలిపారు. కొత్తపేట పండ్ల మార్కెట్ స్థలంలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం సీఎం కేసీఆర్ రూ.1200కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నట్లు తెలిపారు. జేబీ కాలనీ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కబీర్ దాస్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్యాదవ్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్రావు,కార్యదర్శి మాదవరెడ్డి, డాక్టర్స్ కాలనీ ప్రధాన కార్యదర్శి వక్కలంక శ్రీనివాస్రావు, గౌరవ అధ్యక్షులు జగిని రాంమూర్తి, మాజీ కార్పొరేటర్ అనితాదయాకర్రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు బేర బాలకిషన్, మురుకుంట్ల అరవింద్, నియోజకవర్గ యూత్వింగ్ మాజీ అధ్యక్షుడు లోకసాని కొండల్రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మహేందర్యాదవ్, గొడుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.