మహేశ్వరం,జూలై10: పల్లె ప్రగతితోనే గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం సిరిగిరిపురం, మహేశ్వరం, మోడల్స్కూల్, కేసీతండాలో పల్లె ప్రగతి,హరితహారం కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మోతీలాల్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అభివృద్ధిలో నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలుపుతామని తెలిపారు. మహేశ్వరంలో రూ. 50 లక్షలతో రెవెన్యూ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కేసీ తండాలో ఉన్న విప్రో కంపెనీలో స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కేటట్లు చూస్తామన్నారు.
మండలంలో రూ.79,9,164 లక్షల కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. కేసీ తండాకు ఒక ఫంక్షన్హాలు, రూ. 2కోట్లతో మో డల్స్కూల్ నిర్మాణ పనులను చేపడుతున్నామని పేర్కొన్నారు. సోమవారం గవర్నర్ తమిళిసై కేసీ తండా గ్రామానికి రానున్నారని మంత్రి తెలిపారు. గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వస్తున్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అమోయ్కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్,ఆర్డీవో వెంకటాచల ం, ఎంపీపీ రఘుమారెడ్డి,వైస్ఎంపీపీ సునీతాఆంధ్యానాయక్,గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురసాని వరలక్ష్మి సురేందర్రెడ్డి, తహసీల్దార్ ఆర్పీ జ్యోతి, ఎంపీడీవో నర్సింహులు, ఎంఈవో కృష్ణయ్య, డీఎల్పీవో అ మృత,ఇన్చార్జి ఎంపీవో వజ్రలింగం, సహకారబ్యాంక్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, పాల్గొన్నారు.
కందుకూరు, జూలై 10 : మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైందని మండల ప్రత్యేక అధికారి, జిల్లా ప్రాజెక్టు అధికారి శ్రీపాద రామేశ్వర్ శర్మ తెలిపారు. శనివారం సాయంత్రం మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 రోజుల పాటు మండలంలో 35గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల్లో పనులు చురుకుగా కొనసాగాయని తెలిపారు. ఎంపీపీ, జడ్పీటీసీ, అధికారులు, కార్యదర్శలు, ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని పేర్కొన్నారు.
పల్లె ప్రగతిలో భాగంగా పచ్చదనం, పరిశుభ్రతలో విశేషంగా కృషి చేసినందుకు మండల పరిధిలోని నేదునూరును ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాసుల రామకృష్ణారెడ్డిని ఎంపీపీ మంద జ్యోతి పాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, ప్రత్యేక అధికారి శ్రీపాద రామేశ్వర్ శర్మ, ఎంపీడీవో కృష్ణకుమారి, ఎంపీహెచ్వో విజయలక్ష్మి సన్మానించి, ప్రశంసాపత్రం అందజేశారు. అదే విధంగా దెబ్బడగూడ పంచాయతీ కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, పారిశుధ్య కార్మికులు మంద అంజమ్మ తిమ్మాపూరు, డప్పు ఈశ్వరయ్య, చిత్రకారిణిగా అంకిత కటికపల్లిలను ఎంపిక చేసి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మి సురేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ శమంత ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు, జూలై 10: బాధ్యతగా ప్రతి ఒ క్కరూ మొక్కలు నాటాలని ఎంపీపీ మంద జ్యోతి పాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నా రు. మండల పరిధిలోని దెబ్బడగూడలో ఎంపీటీసీ ఎల్మటి లక్ష్మీదేవేందర్రెడ్డి, సర్పంచ్ ఏనుగు శ్రావణి జంగారెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. సీఐ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.