బడంగ్పేట/మహేశ్వరం, జూన్ 9 : సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమానికి స్వర్ణయుగంగా మారిందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధుల ఆలోచన, అధికారుల కష్టం వల్లే రాష్ట్రం సంక్షేమ రంగంలో నంబర్వన్గా నిలిచిందని స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మాంఖాల్లో నిర్వహించిన తెలంగాణ సంక్షేమ సంబరాల్లో పాల్గొన్న ఆమె లబ్ధిదారులకు గొర్రెలు, చెక్కులు పంపిణీ చేశారు. అదే విధంగా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం మంత్రి పర్యటించి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 6వ వార్డులోని ఇమామ్గూడలో రూ.10లక్షలు, ప్రజయ్లో రూ.15లక్షలతో సీసీ రోడ్డు, రూ.51లక్షలతో సింగల్ ఆర్మీలైట్లను ప్రారంభించారు. అనంతరం మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్తో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంత్రి మాంఖాల్ గ్రామంలో గొల్లకుర్మలకు గొర్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కూలిపోయిన కుల వృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ జీవం పోశారన్నారు. చేతి వృత్తిదారులకు చేతి నిండా పనిదొరికే విధంగా చేయడం జరిగిందన్నారు. కుల వృత్తుల వారికి సర్కార్ అండగా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత్వాని చాటుకుంటున్నారని కొనియాడారు. కులవృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. మత్య్సకారులకు, ముదిరాజుల కులస్తుల కోసం చెరువుల్లో చేపలు వదిలే కార్యక్రమం తీసుకోవడం జరిగిందన్నారు. మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తూ 75శాతం సబ్సిడీపై వాహనాలు అందజేయడం జరుగుతుందన్నారు. రజకులకు, నాయీబ్రాహ్మణులలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందనడానికి ఈ పథకాలు నిదర్శనం అన్నారు. దేశంలో ఉన్న అన్ని రాష్ర్టాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని మంత్రి తెలియజేశారు. గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరో సారి నెమరు వేసుకోవడానికి దశాబ్ది ఉత్సవాలను ఊరూరా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. దశాబ్ది ఉత్సవాలకు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన వస్తుందన్నారు. ఈ కర్యక్రమంలో చైర్మన్ కాటేకార్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీవెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు బూడిద తేజస్వీనీశ్రీకాంత్ గౌడ్, విలాస్, రవినాయక్, లావణ్యారాజు, బోధ యాదగిరి రెడ్డి, భవన సుధాకర్, రావిర్యాల మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, మున్సిపల్ కమిషనర్ బి.వెంకట్ రామ్, ఏఈ భార్గవ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
చారిత్రాత్మకమైన మీర్పేట బురుజును తీర్చిదిద్దడం అదృష్టంగా భావిస్తున్నానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఐ మాక్స్ లైట్లను ప్రారంభించారు. అనంతరం మీర్పేటలో ఉన్న పురాతన బురుజును రూ. 45 లక్షలతో మరమ్మతులు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న పురాతన బురుజును తీర్చిదిద్దాలని స్థానిక కార్పొరేటర్లు తన దృష్టికి తీసుకుని రావడంతో మరమ్మతులు చేశామని తెలిపారు.
గతంలో ఈ ప్రాంతం బురుజును చూసినప్పుడు ఎప్పుడు కూలుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉండేదనీ.. ఈ బురుజును తీర్చిదిద్డడండో కొత్త అందాలు సంతరించుకున్నాయని తెలిపారు. అధికారులు, కార్పొరేటర్లు సమన్వయంతో పని చేయడంతో సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ సీహెచ్ నాగేశ్, డీఈ గోపీనాథ్, కార్పొరేటర్లు తీగల సాయినాథ్రెడ్డి, కార్పొరేటర్లు సిద్దాల లావణ్య బీరప్ప, కీసర గోవర్ధన్రెడ్డి, నవీన్గౌడ్, అనిల్ కుమార్, సిద్దాల బీరప్ప, అక్కి మాధవి, గజ్జెల రాంచందర్, భిక్షపతి చారి, విజయలక్ష్మీ రాజు, మాజీ సర్పంచ్ పల్లె పాండుగౌడ్, కో -ఆప్షన్ సభ్యుడు పల్లె జంగయ్య గౌడ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కులవృత్తులకు, చేతివృత్తులకు సర్కారు చేయూతను అందిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం కులవృత్తుల కోసం ఆర్థిక సహాయంలో భాగంగా మహేశ్వరం మండలం దిలావర్ గూడ గ్రామానికి చెందిన వడ్రంగి పని చేసుకొని జీవించే వేణుగోపాలాచారికి రూ.లక్ష చెక్కును జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డి, సర్పంచ్ చంద్రశేఖర్రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో అలోచించి పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. కూడు, గూడు లేని పేదల కోసం సీఎం కేసీఆర్ వారి అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.
సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా నిలుస్తుందని అన్నారు. ప్రజల ఆశీస్సులు, అండ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ శక్తులు ఆపలేవని అన్నారు. పేదల సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంక్ చైర్మన్ మంచె పాండు యాదవ్, జిల్లా రైతు బంధు సమన్వయ సమితి నాయకుడు కూన యాదయ్య, ఎంపీడీవో నర్సింహులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.