మహేశ్వరం, నవంబర్ 21: తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మం డలంలోని డబిల్గూడ, మన్సాన్పల్లి, కొత్త తండా, ఉప్పుగడ్డ తండా, కేబీ తండా, మైలార్బాయి తండా, గంగారం తండా, గంగారం, సిరిగిరిపురం, హర్షగూడ, మంఖాల్లలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో జడ్పీ చైర్పర్సన్ డా॥ తీగల అనితా హరినాథ్రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఆయా గ్రామాలలో మంత్రికి బతుకమ్మలు, పోతరాజుల విన్యాసాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో తండాలను పంచాయతీలుగా మార్చి గిరిజన ప్రజలకు స్వ యం పాలనను అందిస్తున్నామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించనున్నట్టు తెలిపారు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, గ్రామాలల్లో ఇండ్లులేని పేదలకు పట్టాలివ్వడం కూడా ఖాయమని ఆమె పేర్కొన్నారు. గతంలో కరెంటు ఎపుడు వస్తదో..? ఎపుడు పోతదో? ఎవ్వరికీ తెలియదని, నేడు తెలంగాణ రాష్ట్రం లో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణనేనని అన్నారు. కాంగ్రెస్ 3 గంటల కరెంటు చాలని అంటుంది. బీజేపీ వాళ్లు మోటార్లకు మీటర్లను పెట్టాలని అంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలకు 3 గంటల కరెంటు వాళ్లు కావాలా, 24 గంటల కరెం టు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాల్నా? అని ఆమె ప్రజల కు సూచించారు. పింఛన్లు పెరగాలంటె బీఆర్ఎస్ ప్రభు త్వం మూడోసారి అధికారంలోకి రావాలని అన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు భద్రత, బరోసా ఉం టుందన్నారు.
కేంద్రం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి పేదల నడ్డి విరుస్తుందని ఆమె మండిపడ్డారు. సీఎం కేసీఆర్ను గెలిపించి తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వస్తే రూ.4 వందలకే గ్యాస్ సిలెండర్లను అందజేస్తామన్నారు. కరోనా లాంటి కష్ట కాలం లో కానరాని నేతలు నేడు తెలంగాణలో ఎన్నికలు రాగానే పొద్దున్నే ప్రతి ఇంటి ముందు వాలిపోతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. హైద్రాబద్లో ఏం నీళ్లు తాగుతున్నారో మన గ్రామాలలో నేడు అవే నీటిని అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. నల్లా తిప్పితే కేసీఆర్ గుర్తుకు రావాలె.. అని అన్నారు. గ్రామాలలో ఎన్నికల ప్రచారానికి వస్తే నాకు పూల వర్షం ఎలా కురిపిస్తున్నా రో ప్రజలు నాకు ఓట్ల వర్షం కురిపించి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. మహేశ్వరం నియోజక వర్గంలో ఇష్టం లేకున్నా వచ్చి ఎన్నికలలో నిలబడ్డ నాయకులను నామరూపాలు లేకుండా ఓడించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ప్ర భుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే అసైన్డ్ భూ మి ఉన్న వారికి పట్టా హక్కులను కలిపిస్తామని ఆమె తెలిపారు. తెల్లరేషన్ కార్డు దారులందరికి త్వరలోనే రూ.5 లక్షల బీమాను కలిపిస్తామన్నారు. నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానని అన్నారు. నియోజక వర్గానికి వేల కోట్ల రూపాయలను వెచ్చించి ఎంతో అభివృద్ధి చేశానని, ఇంకా ఎంతో చేయాల్సి ఉం దని ఆమె తెలిపారు. నియోజక వర్గం ఆడబిడ్డగా నన్ను దీవించి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.
కార్యక్రమంలో ఎస్సీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు చిలకమర్రి నర్సింహ, ఇన్చార్జి ఎంపీపీ సునితా ఆంధ్యానాయక్, పీఏసీఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు కూన యాదయ్య, బీసీ సెల్ నియోజక వ ర్గం అధ్యక్షుడు వట్టెల మల్లేశ్ యాదవ్, నియోజక వర్గం ఉపాధ్యక్షుడు హనుమ గల్ల చంద్రయ్య, కార్యదర్శి గుం డెమోని అంజయ్య ముదిరాజ్, ఎస్టీసెల్ అధ్యక్షుడు లచ్చానాయక్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అం గోతు రాజు నాయక్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ వర్కల యాదగిరి గౌడ్, కో -ఉప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ, సర్పంచ్లు కంది అరుణ రమేశ్, సాలీ వీరా నాయక్, రాజు నాయక్, ఎం పీటీసీలు స్వప్న రవీందర్, విజయ్ కుమార్, ఎస్సీ, ఎ స్టీ, బీసీ సెల్ అధ్యక్షులు బుసగల్ల జంగయ్య, అంగోతు గోపాల్నాయక్, రాఘవేందర్ గౌడ్ మండల రైతు బం ధు సమితి నాయకుడు రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు.
రేపు సీఎం కేసీఆర్ సభ మహేశ్వరం బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు
బడంగ్పేట, నవంబర్ 21: మహేశ్వరం నియోజకవర్గం, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని సుల్తాన్పూర్లో ఎన్నికల సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 23 గురువారం 11 గంటలకు సుల్తాన్ పూర్లో జరిగే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నట్లు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గ్రౌండ్ను పూర్తిగా చదును చేశారు. లైట్లు, సీసీ కెమెరాలను అమర్చారు. సభకు వస్తున్న ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి సభకు భారీగా జనం తరలి వచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. జేసీబీ, ఇటాచ్లతో పనులు ముమ్మరంగా చేస్తున్నారు. వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు.