యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకే ప్రాంగణాల ఏర్పాటు
మున్సిపాలిటీలు, గ్రామాలకు అధిక నిధులు కేటాయిస్తున్న సీఎం కేసీఆర్
పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి చేసేది తెలంగాణ ప్రభుత్వమే..
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
‘నాగారం, దమ్మాయిగూడ’లలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 13: పచ్చదనంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా, గ్రీనరీకి మారు పేరుగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగం గా నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. హరితహారంలో భాగం గా మంత్రి పలు రకాల మొక్కలు నాటి నీరు పోశారు.
ప్లాస్టిక్ వాడకా న్ని తగ్గించేందుకు నాగారంలో జ్యూట్ బ్యాగులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం, ఆయన మా ట్లాడుతూ యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకే ప్రతి గ్రామంలో, పట్టణాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిని నిర్వహించి పల్లెలు, పట్టణాలను శుభ్రంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. హరితహారంతో గ్రామాలు, పట్టణాలు పచ్చటి తోరణాలుగా దర్శనం ఇస్తున్నాయని మంత్రి అన్నారు. దమ్మాయిగూడలో జరుగుతున్న సీవరేజ్ పైపులైన్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కమిషనర్లు ఏ.వాణిరెడ్డి, స్వామి, వైస్ చైర్మన్లు మల్లేశ్, నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కో-అప్షన్ సభ్యులు, అధికారులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.