మేడ్చల్/ శామీర్పేట, నవంబరు 22 : వ్యాక్సిన్లకు కేరాఫ్ అడ్రస్గా శామీర్పేట మండలంలోని తుర్కపల్లి మారిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తుర్కపల్లిలో ఆయన బుధవారం పర్యటించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తుర్కపల్లి జీనోమ్ వ్యాలీలో అప్పుడే పుట్టిన పసికందుకు అవసరమైన టీకా నుంచి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా టీకా వరకు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. కరోనా టీకా తయారీతో తుర్కపల్లి పారిశ్రామికవాడకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందన తెలిపారు.
మంత్రి కేటీఆర్ కృషితో జీనోమ్ వ్యాలీకి అంతర్జాతీయ స్థాయి సంస్థ లు తరలివచ్చి, పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. వందల నుంచి వేల కోట్ల రూపాయలతో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. ఐటీతో పాటు లైఫ్ సైన్సెస్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. హైటెక్ సిటీలో ఎన్నిక ఐటీ కంపెనీలు ఉన్నాయో తుర్కపల్లిలో అన్ని ఫార్మా కంపెనీలు ఉన్నాయని తెలిపారు. తుర్కపల్లి పారిశ్రామిక వాడల్లోని కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.
సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు వేస్తే ఐదేండ్లు పాటు సేవ చేస్తానన్నారు. అభివృద్ధి కోరుకుంటే కారు గుర్తుకు ఓటేయాలని, వినాశాన్ని కోరుకుంటే కంటే కాంగ్రెస్ ఓటేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మురహరిపల్లిలో లక్ష్మాపూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు దండు రాజేశ్, మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ, మాజీ వార్డు సభ్యుడు వీరాల్, శంకర్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
కేసీఆర్తోనే అభివృద్ధి, సంక్షేమం
పీర్జాదిగూడ: మేడ్చల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మంత్రి మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్రెడి, రాష్ట్ర మహిళా నాయకురాలు, డాక్టర్ ప్రీతిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పీర్జాదిగూడలో 16వ డివిజన్లో కార్పొరేటర్ రమ్య సతీష్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం మేయర్ వెంకట్రెడ్డి, చామకూర ప్రీతిరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీర్జాదిగూడ కార్పొరేషన్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీనీ గెలిపించాలని కోరారు. మంత్రి మల్లారెడ్డి ఆశీర్వదించాలని కోరారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు రమ్య సతీష్గౌడ్, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.