మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 24: ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉందని కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 6, 14, 17, 18వార్డుల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018లో టీఆర్ఎస్కు ఓటు వేసినందుకు మేడ్చల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాల్లో అనేక అభివృద్ధి చేశానని, మరో మారు బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజల ను కోరారు.
సంక్షేమ, అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే ముందు ఉందని, అందుకు ఓటర్లు అందరు బీఆర్ఎస్ను ఆశీర్వదించి కేసీఆర్ను మూడో సారి సీఎంను చేయాలని కోరారు. కులమతాలకు అతీతంగా కేసీఆర్ సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. నాగారం మున్సిపాలిటీలో చౌరస్తాలు, పార్కులు అభివృద్ధి చేశామని,అంతర్గత మురి కి కాలువలు, సీసీ, బీటీ రోడ్లు, వైకుంఠధామాలు, ఓపెన్ జిమ్లు, తదితర అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మళ్లీ గెలిపిస్తే మిగిలిన అభివృద్ధి పనులు, లింక్ రోడ్లు, బాక్స్ డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, పార్టీ అధ్యక్షులు తేళ్ల శ్రీధర్, వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాస్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆయా వార్డుల ప్రజలు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ కార్పొరేషన్లో..
పీర్జాదిగూడ: బీఆర్ఎస్ ప్రభుత్వ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మంత్రి మల్లారెడ్డి గెలునకు నాందిపలుకుతాయని బీఆర్ఎస్ శ్రేణులు అన్నారు. పీర్జాదిగూడ కార్పొరేషన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మేయర్ జక్క వెంకట్రెడ్డి, కార్పొరేటర్లు, సుభాష్నాయక్, హరిశంకర్రెడ్డి, అనంతరెడ్డి, కౌడె పోచయ్య, బండి రమ్య సతీశ్గౌడ్, ప్రనన్నలక్ష్మి వారివారి డివిజన్లలో మేడ్చల్ అభ్యర్థిమల్లారెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ మ్యానిఫెస్టోను అందజేసి ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో నాయకులు, వార్డుకమిటీ సభ్యులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కొర్రెములలో..
ఘట్కేసర్ రూరల్: నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎదురే లేదని మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్ గౌడ్ అన్నారు. మండల పరిధి కొర్రెములలో మంత్రి మల్లారెడ్డికి మద్దతుగా ఇంటింటికీ ప్రచా రం నిర్వహించారు.బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఓటర్లకు వివరించి కేసీఆర్ను మళ్లీ సీఎం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గరాజు గౌడ్, వార్డుసభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శామీర్పేట మండలంలో..
శామీర్పేట: శామీర్పేట ఎంపీపీ ఎల్లూభాయిబాబు, సర్పంచ్లు బాలమణి, కుమార్యాదవ్, జాము రవి, సరసం మోహన్రెడ్డి, దార భాస్కర్, యూత్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యాయాదవ్, మాజీ కో ఆఫ్షన్ సభ్యుడు చాంద్పాషా, జగదీశ్గౌడ్, లింగం, బాలేశ్, రాపెని కుమార్, విష్ణు, ముక్కెర సంజీవయాదవ్లతో పాటు పార్టీ శ్రేణులు ఉమ్మడి శామీర్పేట ఇంటింటి ప్రచారం చేపట్టారు. కారు గుర్తకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మేడ్చల్ మండలంలో..
మేడ్చల్ రూరల్: మేడ్చల్ మండలంలో బీఆర్ఎస్ నేత లు, మహిళా నాయకురాళ్లు ఇంటింటికీ తిరిగి మంత్రి మల్లారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మండలంలోని రాజబొల్లారం గ్రామంలో జడ్పీటీసీ శైలజా విజయనందరెడ్డి, స్థానిక నేతలతో కలిసి ఇంటింటికీ వెళ్లి కేసీఆర్ అందజేసిన పథకాలను వివరిస్తూ, బొట్టుపెట్టి కారు గుర్తుకు ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ వస్తేనే బతుకులు బాగు పడుతాయని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి మంత్రి మల్లారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అంకిత రవినాయక్, బీఆర్ఎస్ మండల మహి ళా అధ్యక్షురాలు రమాదేవి, నాయకులు సుదర్శన్, ప్రకాష్రెడ్డి, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.