మేడ్చల్ రూరల్, నవంబర్ 20: సీఎం కేసీఆర్ అందించిన పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధిచేకూరిందని, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి ఆగం కాకుండా అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ప్రజలకు సూచించారు. మేడ్చల్ మండలంలోని సోమారం, ఎల్లంపేట, సైదోనిగడ్డ తండా, రావల్కోల్ గ్రామాల్లో సోమవారం మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…పదేండ్ల క్రితం వెలవెలబోయిన గ్రామాలు బీఆర్ఎస్ పాలనతో నేడు అభివృద్ది పథంలో దూసుకుళ్తున్నాయన్నారు.దేశంలో ఎక్కడా లేని అభివద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే రూ. 3వేల పింఛన్ను అందించబోతున్నారని, రైతుబంధును రూ.12వేలు చేయబోతున్నామని, రూ. 400లకే గ్యాస్ సిలిండర్ణు అందిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయనందరెడ్డి, జిల్లా రైతుబంధుసమితి అధ్యక్షుడు నందారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాద వ్, సర్పంచ్లు ఫోరం జిల్లా అధ్యక్షుడు విజయనందరెడ్డి, మాజీ జడ్పీటీసీ శైలజా హరినాథ్, వైఎస్ ఎంపీపీ వెంకటేశ్, సర్పంచ్లు సుజాత కిషన్ నాయక్, మహేందర్, కవిత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాద వ్, పీఏసీఎస్ చైర్మన్లు రణదీప్రెడ్డి, సురేశ్రెడ్డి, నాయకులు రాజమల్లారెడ్డి, ప్రభాకర్రెడ్డి, అంతిరెడ్డి, భాగ్యరెడ్డి, బలరాంరెడ్డి, వెంకటేశ్, కిషన్ నాయక్, శ్రీనువాస్, కరుణాకర్రెడ్డి, నాగేందర్రెడ్డి, సత్యనారాయణ, మహేందర్ యాదవ్, ఆంజనేయులు, గోపాల్రెడ్డి, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ మండలంలోని సోమారం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల యువ నాయకులు 50 మంది బీఆర్ఎస్లో చేశారు. వారికి మంత్రి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లో ఆహ్వానించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. నాయకుల కలిసి కట్టుగా ఉండి బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని మంత్రి సూచించారు. అదేవిధంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలి టీ పరిధిలోని జ్ఞానాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు 25 మంది బీఆర్ఎస్ మేడ్చల్ మండల ఇన్చార్జి గోపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ అంతోనమ్మ ఫిలిప్స్, నాయకులు భాస్కర్రెడ్డి, సుధాకర్, బాలస్వామి, ప్రేమ్కుమార్, జోసెఫ్, శౌరీ, రాజు, జాకెన్ తదితరులు పాల్గొన్నారు.
నేడు మేడ్చల్ మండలంలో మంత్రి మల్లారెడ్డి ప్రచారం
మేడ్చల్, నవంబరు 20 : మేడ్చల్ మండలంలో మంగళవారం మంత్రి మల్లారెడ్డి ఉదయం 8 గంటలకు బండమాదారంలో ప్రచారాన్ని ప్రారంభిస్తారని, ఆ తర్వాత నూతన్కల్, కోనాయిపల్లి, మైసిరెడ్డిపల్లి, లింగాపూర్, రాజబొల్లారం తండా, అక్బర్జాపేట, రాజబొల్లారం, ఘనపూర్, పూడూరు గ్రామాల్లో పర్యటించి, కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్ ఒక ప్రకటన తెలిపారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని వారు కోరారు.