మేడ్చల్ రూరల్, నవంబర్ 26: తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని, ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి మరింత అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి, రాయిలాపూర్, శ్రీరంగవరం, డబిల్పూర్ గ్రామాల్లో ఆదివారం ర్యాలీ, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలిపారు.ఓట్లు దండుకోవడానికి వస్తున్న కాంగ్రె స్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. మరోమారు గెలిపిస్తే గ్యాస్ సిలిండర్ను రూ.400కు, పింఛన్లు రూ. 5వేలవరకు,రైతు బంధు రూ. 15 వేలు, మహిళలకు రూ .3వేల అర్థిక సహయం అందించనున్నామని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిపించినందుకు శక్తివంచన లేకుండా పాటుపడి నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశానని అన్నారు.
ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ వైలజా విజయనందరెడ్డి, జిల్లా రైతు బందు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు విజయనందరెడ్డి, మాజీ జడ్పీటీసీ శైలజా హరినాథ్, మాజీ ఎంపీపీ పద్మ జగన్రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్, సర్పంచ్లు గీత భాగ్యరెడ్డి, నర్మదా గోపాల్రెడ్డి, ఎంపీటీసీలు అనూప శ్రీకాంత్రెడ్డి, ప్రకాష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, నాయకులు రాజమల్లారెడ్డి, అంతిరెడ్డి, ప్రభాకర్రెడ్డి, రణదీప్రెడ్డి, సురేష్రెడ్డి, జగన్రెడ్డి, భాగ్యరెడ్డి, అశోక్, రమాదేవి, పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి జన నీరాజనం
మేడ్చల్ మండలంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డికి గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతంతో నీరాజనం పట్టారు. డబిల్పూర్ గ్రామంలో ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, సర్పంచ్ గీత భాగ్యరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి గజమాల సమర్పించారు. ఆయా గ్రామాల్లో బోనాలతో,మహిళలు మంగహారతులతో మంత్రికి తిలకందిద్దారు. శ్రీరంగవరంలో జడ్పీటీసీ విజయనందరెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మలు, పోతరాజులతో స్వాగతం పలికారు.
మాదిగలను పట్టించుకోని బీజేపీ,కాంగ్రెస్
ఘట్కేసర్,నవంబర్26: మాదిగల సమస్యను కాంగ్రెస్, బీజేపీలు ఏనాడూ పట్టించుకోలేదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్లో మాదిగల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.దాదాపు 30 సంవత్సరాలుగా వర్గీకరణ సమస్యను ఆ పార్టీలు ఇప్పటి వరకు పరిష్కరించలేదని పేర్కొన్నారు.సీఎం కేసీఆర్ వర్గీకరణ సమస్యను పరిష్కరించే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్లకు ఎన్నికలు వస్తేనే మాదిగలు గుర్తు వస్తారు మంత్రి అన్నారు.ఎస్సీ వర్గీకరణ కేసీఆర్తోనే సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. పనిచేసే ప్రభుత్వానికి దళితులు సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ పావనీ జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,ఎమ్మార్పీఎస్ టీఎస్ నాయకుడు మల్లేష్, కౌన్సిలర్లు,బీఆర్ఎస్ నాయకులు,మాదిగలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బీజేపీకి బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి రాజీనామా
మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
బీజేపీకి మరో షాక్ తగిలింది.తూంకుంట మున్సిపాలిటీకి చెందిన బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జి నూనెముంతల రవీందర్గౌడ్ పార్టీని వీడాడు. పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మంత్రి మల్లారెడ్డి సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం ఆయన నివాసం మంత్రి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తింపు లేని చోట ఉండడం కన్న అభివృదద్ధే లక్ష్యంగా పని చేస్తున్న బీఆర్ఎస్తో నడవాలని, బీఆర్ఎస్లో చేరడం జరిగిందన్నారు.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని మంత్రి,రవీందర్గౌడ్కు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేయాదవ్, యాదగిరి, గోపాల్రెడ్డి, సాయియాదవ్, దీపక్రెడ్డి, మహిపాల్పాల్గొన్నారు.