బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వచ్చాక టీఎస్పీఎస్సీలో జాబ్ క్యాలెండర్ ప్రతిపాదికన నియామకాలు చేపడుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బండారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ.. నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళనతో పాటు శాశ్వత ఉద్యోగులతో బలోపేతం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ శాంతియుతంగా ఉందన్నారు. ఎలాంటి ప్రాంతాల గొడవలు లేకుండా ప్రజలు ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారన్నారు. కరెంటు కష్టాలు లేవని, తాగునీరు వస్తున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ నాయకత్వంలో ప్రజారవాణా, వరద నీటి నిర్వహణ వ్యవస్థ, మెట్రో విస్తరణ చేపడుతామని స్పష్టం చేశారు.