బంజారాహిల్స్, నవంబర్ 16: శాసనసభ ఎన్నికల ప్రచారంలో భా గంగా శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కోరారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యా లయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..నగర వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్షోలలో నియోజకవర్గంలోని రెండు ప్రాంతాల్లో సభలు నిర్వహించనున్నామన్నారు.
దీనిలో భాగంగా శుక్రవారం సాయంత్రం 6గంటలకు రహ్మత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్లో, సాయంత్రం 6.30కి యూసుఫ్గూడ చెక్పోస్ట్ల వద్ద మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారన్నారు. శ్రీరాంనగర్ సభలో రహ్మత్నగర్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావునగర్ డివిజన్ల కు చెందిన ప్రజలు హాజరు అవుతారని, యూసుఫ్గూడ చెక్పోస్ట్ వద్ద సభలో యూసుఫ్గూడ,శ్రీనగర్ కాలనీ, షేక్పేట డివిజన్లకు చెందిన ప్రజలు హాజరు కావాలని సూచించారు.