KTR | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం( Hyderabad City ) ఎంతో అభివృద్ధి చెందిందని, ఇది కేవలం టీజర్ మాత్రమే.. సినిమా ముందుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో సినిమా షూటింగ్లు( Cinema Shooting ) చేసి.. బెంగళూరు( Bengaluru ) అని చెప్పుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు.
సీఎస్ఆర్ ( కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ) నిధులతో జీహెచ్ఎంసీ( GHMC ) పరిధిలోని 25, హెచ్ఎండీఏ( HMDA ) పరిధిలోని 25 చెరువుల అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న వివిధ నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులకు ఒప్పంద పత్రాలను కేటీఆర్ అందించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దుర్గం చెరువు( Durgam Cheruvu ) మీ అందరూ చూసే ఉంటారు. దుర్గం చెరువుపై ఎప్పుడైతే కేబుల్ బ్రిడ్జి( Cable Bridge ) నిర్మించామో, ఆ చెరువును అభివృద్ధి చేశామో.. ఆ తర్వాత అక్కడకు టూరిస్టుల( Tourists ) తాకిడి ఎక్కువైంది. ఈ మధ్యకాలంలో సినిమాలు చూసినట్టు అయితే నాకు తెలిసి దుర్గం చెరువు బ్రిడ్జి లేని సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు. ఇంకా హైలెట్ ఏంటంటే.. ఖాజాగూడ్ లేక్( Khajaguda Lake ) పక్కనే డెవలప్ చేసిన లింక్ రోడ్డుపై కూడా సినిమా షూటింగ్లు చేశారు. కొవిడ్ టైమ్లో ఎక్కువ సినిమాలు చూశాను. ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్లో ఓ మలయాళం సినిమా( Malayalam Movie ) చూస్తున్నాను. ఆ సినిమాలో పృథ్వీరాజ్ లీడ్ క్యారెక్టర్. కరెక్ట్గా ఇదే రోడ్డుమీద సినిమా షూటింగ్ చేశారు. ఈ రోడ్డు మీద షూటింగ్ చేసి ఆ సినిమాలో ఏం చూపిస్తున్నారో తెలుసా..? అది బెంగళూరు అని చూపెడుతున్నారు. నాకు చాలా ఒళ్లు మండింది.. హైదరాబాద్లో షూటింగ్ చేసి.. బెంగళూరు అని చెప్పుకుంటున్నారు ఏందని..? నేను ఏదో ఒకటి అందామనుకున్నాను. ఈ లోపే ఓ మహిళా జర్నలిస్టు(హైదరాబాద్కు చెందిన) ట్వీట్ చేసింది. ఇదేం దారుణం.. మా హైదరాబాద్లో షూటింగ్ చేసి.. బెంగళూరు అని చెప్పడం ఇదేక్కడి అన్యాయం అని ప్రశ్నించింది. అప్పుడు నాకు సంతోషం అనిపించింది. ఇది మన హైదరాబాద్ నగరం అని ప్రతి హైదరాబాదీలో కనబడుతుంటే సంతోషం అనిపిస్తుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.