తెలంగాణ హైకోర్టు న్యాయవాది, రంగారెడ్డి జిల్లా (విశ్వకర్మ)కు చెందిన రఘు లెంకలపల్లి చేయి తిరిగిన ఆర్టిస్టు. సీఎం కేసీఆర్ అన్నా.. మంత్రి కేటీఆర్ అన్నా.. చెప్పలేని అభిమానం.
తాను స్వయంగా గీసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాన్ని తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ను కలిసి అందజేశారు. చిత్రకారుడు రఘును ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభినందించారు.