మహేశ్వరం, నవంబర్ 19: ఈనెల 30న ఓటేసే ముందు గ్యాస్ బండకు దండం పెట్టి.. కారు గుర్తుకు ఓటు వేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ దేవేందర్నగర్ కాలనీలో జరిగిన రోడ్ షోలో ఆమె ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే తుక్కుగూడ మరో మహానగరంగా మారనుందని తెలిపారు. ఫాక్స్కాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఈ ప్రాంతానికి రానుండటంతో మరో హైటెక్ సిటీగా మారనుందని.. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే రూ.4వందలకే గ్యాస్ సిలిండర్, సౌభాగ్యలక్ష్మి ద్వారా రూ.3వేలు, రేషన్ కార్డుదారులకు బీమా సౌకర్యం, రూ.2వేలు ఉన్న ఆసరా పింఛన్లు రూ.5వేలు, రూ.4వేలు ఉన్న దివ్యాంగుల పింఛన్లను రూ.6వేలకు పెంచుతామని తెలిపారు. వేలాది కోట్లతో మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు వివరించారు. ఈనెల 30న కారు గుర్తుకు ఓటేసి మరోసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమీషన్ మాజీ సభ్యుడు చిలక మర్రి నర్సింహ, కౌన్సిలర్లు సప్పిడి లావణ్యరాజు, బూడిద తేజస్వినీ శ్రీకాంత్గౌడ్, రెడ్డగళ్ల సుమన్, బాధావత్ రవినాయక్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జెల్లల లక్ష్మయ్య, యూత్ అధ్యక్షుడు సామ్యూల్రాజు, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట, నవంబర్ 19: జల్పల్లి ప్రాంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక అభిమానం ఉండటంతోనే 30 పడకల ఆస్పత్రి మంజూరు చేయించారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పహాడీషరీఫ్లో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముస్లిం మైనార్టీలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో నాలుగు వేల మదికి షాదీముబారక్ చెక్కులు అందజేశాని.. పహాడీషరీఫ్ దర్గాకు రూ.14కోట్లతో ర్యాంప్ రోడ్డుకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. రూ.100కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి, మైనార్టీ నాయకులు, దస్తగిరి, మేరాజ్ ఖాన్, యాసీప్ బేగం, నాసర్ వలీ, కొండల్ యాదవ్, ఉసేనీ తదితరులు ఉన్నారు.
బడంగ్పేట, నవంబర్ 19: బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మకూడదని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి కోరారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23 డివిజన్కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కో-ఆప్షన్ సభ్యురాలు గుర్రం ప్రసన్న వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ప్రతిపక్షాలను నమ్మి ఓటేస్తే గోసపడుతామని.. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ సర్కార్ను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.
ఆర్కేపురం, నవంబర్ 19 : కాంగ్రెస్, బీజేపీని నమ్మితే మోసపోతామని బీఆర్ఎస్ అభ్యర్థి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ఆర్కేపురం డివిజన్ హరిపురి కాలనీకి చెందిన 100 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్శర్మ ఆధ్వర్యంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గొడుగు శ్రీనివాస్ముదిరాజ్ తదితరులు ఉన్నారు.
మహేశ్వరం, నవంబర్ 19: బీఆర్ఎస్తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని గంగారం సర్పంచ్ సాలీ వీరానాయక్ తెలిపారు. ఆదివారం గంగారం, మైలార్బాయి తాండాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మద్దతుగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్నాయక్తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాండు, దేవా, రాజు, ముకేశ్, తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు, నవంబర్ 19 : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి కోరారు. దెబ్బడగూడ గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, మాజీ డైరెక్టర్ జిట్టె రాజేందర్రెడ్డి, యూత్ అధ్యక్షుడు కొలను విఘ్నేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్ డ్యారంగుల జంగయ్యతో కలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి.. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు.
కందుకూరు, నవంబర్ 19 : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి నేడు మండలంలో ఎన్నికల ప్రచారం చేస్తారని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి తెలిపారు. ఉదయం సరస్వతిగూడ నుంచి అగర్మియగూడ, లేమూరు, తిమ్మాపూరు, జబ్బార్గూడ, రాచులూరు, బేగంపేట్, బైరాగిగూడ, కొత్తూరు గ్రామాల్లో ప్రచారం చేస్తారని.. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
ఆర్కేపురం, నవంబర్ 19:రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగించేందుకు బీఆర్ఎస్ పార్టీని మరోమారు గెలిపించాలని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం వీఎం హోం మైదానంలో వాకర్స్ను కలిసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. అలాగే విజయపురి కాలనీ అసోసియేషన్, హుడా కాంప్లెక్స్లో అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఐదేండ్ల కోసారి ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చే కాంగ్రెస్, బీజేపీలు మనకొద్దని, ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకునే సీఎం కేసీఆర్ కావాలని తెలిపారు.
సీఎం కేసీఆర్ సహకారంతో మహేశ్వరం నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరింత అభివృద్ధి కోసం నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్గుప్తా, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్రెడ్డి, నియోజకవర్గ యూత్వింగ్ మాజీ అధ్యక్షుడు లోకసాని కొండల్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు బోయిని మహేందర్యాదవ్, డివిజన్ మాజీ అధ్యక్షుడు ఇంటూరి అంకిరెడ్డి, ధర్పల్లి అశోక్ తదితరులు ఉన్నారు.