DK ShivaKumar : ప్రముఖ నటుడు, హత్య కేసులో జైలుపాలైన దర్శన్ ఫ్యాన్స్ (Darshan Fans) పై కర్ణాటక సీఎం (Karnataka CM) డీకే శివకుమార్ (DK Shivkumar) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన ప్రసంగం మధ్యలో ఏకంగా వారివైపు మైకునే విసిరారు. అసలేం జరిగిందంటే రామనగర (Ramanagara) లో ప్రసిద్ధ శ్రీ చాముండేశ్వరి (Sri Chamundeshwari) కరగ మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ మహోత్సవంలో సీఎం మైకు తీసుకుని మాట్లాడటం ప్రారంభించగానే దర్శన్ అభిమానులు ది బాస్, ది బాస్ అంటూ నినాదాలు చేశారు. మౌనంగా ఉండండి అని ఎంత చెప్పినా వినకపోవడంతో సీఎంకు కోపం వచ్చింది. దాంతో ఆయన వాళ్లవైపు మైకు విసిరేసి మాట్లాడటం ఆపేశారు. ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ కూడా వారి పట్ల అసహనం వ్యక్తంచేశారు. ఆ తరువాత మాట్లాడిన సీఎం డీకే.. ‘మీ అభిమానాన్ని నేను గౌరవిస్తాను, ఇది భక్తి కార్యక్రమం, కోర్టులో ఉన్న విషయాలను ఇక్కడ మాట్లాడలేను, అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నా’ అన్నారు.