సిటీబ్యూరో: పాతనగరంలో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ సర్కారు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఎంజీబీఎస్-ఫలక్నుమా మెట్రో కారిడార్ నిర్మాణానికి రూ. 2వేల కోట్లతో చేపట్టే ప్రాజెక్టు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు.
యాకుత్పుర, చార్మినార్, బహదూర్పుర అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రోడ్ల విస్తరణకు రూ. 200 కోట్లు కేటాయించగా, రెండు రోజుల కిందటే మీరాలం చెరువుపై నిర్మించే హై లెవల్ బ్రిడ్జి కోసం అవసరమైన రూ. 363 కోట్లకు పరిపాలన అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది.