హైదరాబాద్ : హైదరాబాద్లోని జర్నలిస్టుల(Journalists)కు ఇండ్ల స్థలాలు(House sites) ఇచ్చితీరుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ (DJHS) అధ్యక్షుడు బొల్లోజు రవి, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు దండా రామకృష్ణ, స్వామిరెడ్డి, సభ్యులు క్రాంతి తదితరులు సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఈ విషయంపై సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోనూ చర్చించాలని డీజేహెచ్ఎస్ ప్రతినిధులకు ఆయన సూచించారు.