సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించడంపై జిల్లా ఉపాధి కల్పన శాఖ దృష్టిసారించింది. అందులో భాగంగా ఈ నెల 15న ఉదయం 10గంటల నుంచి మల్లేపల్లిలోని జిల్లా ఉపాధి కార్మిక శాఖ కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నారు.
10వ తరగతి, ఇంటర్, డిగ్రీతో పాటు పాలిటెక్నిక్ కోర్సులలో ఉత్తీర్ణులైన యువతకు జాబ్మేళాలో పాల్గొనడానికి అవకాశం ఉందన్నారు. అపోలో, జీడాస్ ప్రైవేటు లిమిటెడ్, అవాస కన్సల్టెన్సీ, డాన్ బాస్కో నెట్వర్క్ వంటి నాలుగు కంపెనీలలో కలిపి మొత్తం 200 ఉద్యోగాల కోసం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి శాఖ అధికారిని మైత్రిప్రియ తెలిపారు.