అంబర్పేట, ఆగస్టు 15 : పేదలకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ లోకాయుక్త జస్టిస్ సి.వి.రాములు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పీపుల్స్ హెల్త్ ఆర్గనైజేషన్, సీజన్స్ హాస్పిటల్, డీడీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తాధ్వర్యంలో డీడీకాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
డాక్టర్లు సేవాదృక్ఫథంతో వైద్యం అందించాలని సూచించారు.
కార్యక్రమంలో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ హరిచరణ్, ప్రధాన కార్యదర్శి డా.విజయచరణ్, డీడీ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి డా.ఎన్.గౌతంరావు, పి.గోవర్ధన్రెడ్డి, రాజిరెడ్డి, పుట్ట పాండురంగయ్య, వీణా డిగ్గీకర్, సుబ్బారెడ్డి, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.