సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): పేద ప్రజలకు మహావీర్ దవాఖాన అందిస్తున్న సేవలు ఎంతో అద్భుతమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. మాసబ్ట్యాంక్లోని మహావీర్ దవాఖానలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మహావీర్ హాస్పిటల్కు స్థలాన్ని కేటాయిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జారీ చేసిన పత్రాలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ కలిసి దవాఖాన చైర్మన్ మహేందర్ రాకాజీ, వైస్ చైర్మన్ సుశీల్ కపాడియాలకు అందజేశారు.
1974లో ప్రారంభించిన ఈ దవాఖానలో పేద ప్రజలకు తక్కువ చార్జీలతో వైద్యం అందించడం అభినందనీయమని మంత్రి తలసాని పేర్కొన్నారు. అలాగే జైన్ సంఘ్కు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఉప్పల్ భగాయత్లో 2 ఎకరాల భూమిని కూడా కేటాయించిన విషయాన్ని మంత్రి తలసాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్థలం కేటాయించడం పట్ల హాస్పిటల్ నిర్వాహకులు సీఎం కేసీఆర్, మంత్రి తలసానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, హాస్పిటల్ యాజమాన్యం, సునీల్ పహేడే, మోతీలాల్, ఆశ, గింసి లాల్ జైన్ తదితరులు పాల్గొన్నారు.