సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): పోలీసు విధుల్లో ఉత్తమ సేవలు అందిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ట్రై పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బందికి పలు పతకాలు వరించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఈ పతకాలను రాష్ట్ర వ్యాప్తంగా 281 మంది పోలీసు అధికారులు అందుకున్నారు. ఇందులో రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్తో పాటు ప్రస్తుత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కూడా ఉన్నారు.
ఇందులో అతి ఉత్కృష్ట్ సేవా పథక్(2022) ఉత్కృష్ట్ సేవా పతక్(2022), అసాధారన్ అసూచన కుశలత పతక్(2020-21), యూనియన్ హోమ్ మినిస్టర్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్విస్టిగేషన్(2018-2021), యూనియన్ హోమ్ మినిస్టర్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ట్రైనింగ్(2019-2021), తెలంగాణ స్టేట్ శౌర్య పతకం (2022), తెలంగాణ స్టేట్ మహోన్నత సేవా పతకం (2022), తెలంగాణ స్టేట్ ఉత్తమ సేవా పతకం (2022), అంత్రిక్ సురక్ష సేవా పతకం(2019-21)లు ఉన్నాయి. ఇదిలా ఉండగా పతకాలు సాధించిన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లకు చెందిన డీఎస్సీ ఆపై స్థాయి అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.