సిటీబ్యూరో, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా రూపొందిందని, ప్రపంచ దేశాలు నగరంలో ఐటీ సంస్థల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాయని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. వాషింగ్టన్ డీసీలో బుధవారం జరిగిన యునైటెడ్ నేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఈవెంట్లో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ప్రత్యేక వక్తగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణకు హరిత హారం కార్యక్రమంపై ఈ సందర్భంగా మేయర్ వివరించారు. హైదరాబాద్ నగరంలో రోడ్ల వెంట సెంట్రల్ మీడియన్లో విసృ్తతంగా మొకలు నాటడం జరిగిందని మేయర్ తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో, పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీ, ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున పచ్చదనం పెంపొందించడంతో పాటు ట్రీ పారులు, పంచతత్వ పారులు, మేజర్ పారుల అభివృద్ధి, కాలనీ పారులలో విరివిగా మొకలు నాటడం, ప్రతి ఇంటికి ఉచితంగా మొకలు పంపిణీ చేయడం, ఫె్లైఓవర్ల కింద గార్డెన్లను ఏర్పాటు చేయడం, ఫె్లైఓవర్ల పిల్లర్లకు వర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేయడంతో హైదరాబాద్ను పచ్చని, పర్యావరణ అనుకూల నగరంగా మార్చడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు స్ఫూర్తిదాయకమైన నగరంగా మర్చడం జరిగిందని మేయర్ వివరించారు.
సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో జీహెచ్ఎంసీ ఆడవుల పెంపకం డ్రైవ్లు, పట్టణ ప్రాంతాల్లో వర్టికల్ గార్డెనింగ్, పర్యావరణ అనుకూల వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులతో సహా అనేక ప్రగతిశీల చర్యలు అమలు చేశామని మేయర్ వెల్లడించారు. కాగా, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో మేయర్ చేసిన ముఖ్య ప్రసంగం హైదరాబాద్ యొక అద్భుతమైన విజయాలను ప్రదర్శించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధికి నగరాల నిబద్ధతను అద్దం పట్టింది. మేయర్ స్ఫూర్తిదాయకమైన మాటలు వినూత్న కార్యక్రమాలు ప్రపంచ వేదికపై చెరగని ముద్ర వేశాయి.