సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి మించి నమోదవుతున్నాయి. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో పగలు ఉక్కపోత, రాత్రి సమయాల్లో వాతావరణం చల్లగా మారుతున్నది.
సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ 33.2, కనిష్ఠం 19.7 డిగ్రీలు, గాలిలో తేమ 50 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.