2865 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు,
ఏఎస్సైలకు స్థాన చలనం
సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీ స్థాయిలో సిబ్బందిని బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 2006 పోలీస్ కానిస్టేబుళ్లు, 649 హెడ్ కానిస్టేబుళ్లు, 219 మంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు.
కొవిడ్ కారణంగా 2018 నుంచి సిటీ పోలీస్ కమిషనరేట్లో సిబ్బంది బదిలీల ప్రక్రియ పెండింగ్లో పడుతూ వస్తోంది. శాంతి భధ్రతలు, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో ఒకే చోట 5 ఏండ్లు, ఒకే జోన్లో ఏడు సంవత్సరాలు పనిచేస్తున్న సిబ్బందిని తాజాగా బదిలీ చేశారు. హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టం(హెచ్ఆర్ఎంఎస్) అనే సాఫ్ట్వేర్ ద్వారా ఒకే స్థానంలో పనిచేస్తున్న వారు, సాధారణ బదిలీకి అర్హులైన సిబ్బంది జాబితాను తయారు చేసి స్థాన చలనం కల్పించారు.