హైదరాబాద్ : మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి షరీఫ్ నగర్లోని ఓ ఇంటిలో భారీ చోరీ జరిగింది. గురువారం గుర్తు తెలియని దుండగులు 40తులాల బంగారం, కొంత నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..ఇంటి యజమాని మహమూద్ అలీ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి.
అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో దాచిన 40 తులాల బంగారం లేకపోవడంతో మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీఏస్, ఎస్వోటీ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.