నేరేడ్మెట్, నవంబర్ 28: ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన మంగళవారం మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖరెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, నాయకులు,కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మౌలాలి నుంచి ప్రారంభమైన ర్యాలీ వినాయకనగర్, సఫిల్గూడ, ఆనంద్బాగ్, మల్కాజిగిరి చౌరస్తాల మీదు గా మీర్జాల్గుడ వరకు కొనసాగింది. వివిధ డివిజన్ల నుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలబడాలని… కారు గుర్తుకు ఓటు వేయాలని నినాదాలు చేశారు. ఆయా ప్రాంతాలన్నీ గులా బీ మయంగా మారాయి. ఎటుచూసినా జనసందో హం గా మారాయి. కార్లు, బైక్లకు గులాబీ జెండాలను ఆలంకరించి ర్యాలీని నిర్వహించారు. అభ్యర్థి రాజశేఖర్రెడ్డి దారిపొడవునా ప్రజలను పలకరిస్తూ, అభివాదాలు చేశా రు. మధ్యమధ్యలో చిరు వ్యాపారులతో మట్లాడుతూ ఆయన ముందుకుసాగారు. దుకాణదారులను కలిసి ఆత్మీయంగా మాట్లాడి కేసీఆర్ సర్కారుకు మరోసారి అండగా ఉండాలని ఆయన కోరారు. మీర్జాలగుడ చౌరస్తాలో ర్యాలీని ముగించారు.
ఈ సందర్భంగా అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డి మట్లాడుతూ .. మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిన మైనంపల్లి హన్మంతరావుకు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉన్నారని, ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ప్రధాన సమస్యలన్నింటినీ తాను గెలిచిన తరువాత పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని, కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని ఆయన కోరా రు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4వందలకే వంట గ్యాస్ సరఫరా, సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.3వేల నగదు అందజేయనున్నట్లు ముఖ్యమ్రంతి కేసీఆర్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ప్రాణ త్యాగాలు, ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి పాటుపడుతున్న కేసీఆర్ను దీవించాలని రాజశేఖర్రెడ్డి ప్రజలను కోరారు. ఈకార్యక్రమంలో ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్లు మేకల సునీతారాముయాదవ్, మీనారెడ్డి, మురుగేష్, మాజీ కార్పొరేటర్ జగదీష్గౌడ్, నర్సింగ్రావు, నాయకులు బద్దం పరుశురామ్రెడ్డి, జికె.హన్మంతరావు, చంద్రమౌళి పాల్గొన్నారు.
నేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్ నుంచి నేరేడ్మెట్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించా రు. మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి సతీమణి మమతారెడ్డి, కార్పొరేటర్ మీనారెడ్డి, నాయకులు జీకే హన్మంతరావు, ఉపేందర్రెడ్డి, మధుసూదన్రెడ్డి తదితరు లు పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ మమతా రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.