మల్కాజిగిరి, అక్టోబర్ 18 : ప్రజా సంక్షేమం కోసం పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపించాలని పార్టీ మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్బండపై మోపిన ఆర్థిక భారాన్ని తగ్గించడానికి అర్హులైన వారికి రూ.400కే సిలిండర్ అందజేయనున్నట్లు తెలిపారు. కుటుంబానికి రూ.5లక్షల బీమా, పింఛన్ల పెంపు, తదితర వాటిని మ్యానిఫెస్టోలో సీఎం కేసీఆర్ ప్రకటించారని చెప్పారు. ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని న్యూవిద్యానగర్లో యువకులతో సమావేశం నిర్వహించి పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం గౌతంనగర్ డివిజన్లో టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన కోమరయ్య, రాములుగౌడ్లకు కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం కాలనీల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం తథ్యమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని అన్నా రు. ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషిచేస్తామన్నారు. డీసీఎం, ఆటో కార్మికుల కంటుంబాలకు అండగా ఉంటామని అన్నారు.
డీసీఎం, ఆటో కార్మికుల కుటుంబాలకు దుండిగల్లోని అరుంధతి దవాఖాన ద్వారా ఉచితంగా వైద్య చికిత్సలు అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, బద్దం పరశురాం రెడ్డి, జేఏసీ వెంకన్న, గౌలికర్ రవీందర్, పేపర్ శ్రీను, టీడీపీ నుంచి పార్టీలో చేరిన కోమరయ్య, రాములుగౌడ్, రాష్ట్ర ట్రాన్స్పోర్టు యూనియన్ అధ్యక్షుడు అత్తిమొని నాగేశ్కుమార్, మల్కాజిగిరి కమిటీ అధ్యక్షుడు సంతోష్గుప్తా, డీసీఎం స్టాండ్ అధ్యక్షుడు ఎం.శ్రీనుకుర్మా, ఉపాధ్యక్షుడు సిద్ధులు, ప్రధాన కార్యదర్శి ఉపేందర్, యాగిరి, సత్తయ్య, మల్లేశ్, ఉప్పలయ్య నాయకులు కృష్ణ, గుప్త , తదితరులు పాల్గొన్నారు.