హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్పై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మండిపడ్డారు. బండి సంజయ్ మల్కాజ్గిరి వచ్చి గూండాయిజం చేస్తున్నారని, బీజేపీ నాయకులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుండగా.. ఓ పోలీసు అధికారిపై మల్కాజ్గిరి బీజేపీ నాయకులు దాడి చేశారని, టీఆర్ఎస్ కార్యకర్తలపైనా దాడి చేశారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్ చుట్టూ ఉన్నది భూకబ్జాదారులేనని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు తమ వ్యవహార శైలి మార్చుకోకపోతే గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా సంజయ్ ఆరోపణలు చేశాడు. బండి సంజయ్ స్థాయి కార్పొరేటర్కి ఎక్కువ… ఎంపీకి తక్కువ అని మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు.