మల్కాజిగిరి, అక్టోబర్ 27: ప్రజల ఆరోగ్యం కోసం మల్కాజిగిరిలో వంద పడకల దవఖానను నిర్మిస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మచ్చ బొల్లారం, మల్కాజిగిరి, అల్వాల్, ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లలోని బస్తీలు, కాలనీల్లో పాదయాత్ర చేసి మహారాష్ట్ర ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్ రావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గెలిచిన తర్వాత మొదటగా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, ఐటీఐని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పేద కుంటుంబాలకు సన్న బియ్యం, తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబాలకు రూ. 5లక్షల జీవిత బీమా, దివ్యాంగులకు రూ.6,016పింఛన్, వంట గ్యాస్ రూ.400లకే సరఫరా, సౌభాగ్యలక్ష్మి అర్హులైన పేద మహిళలకు నెలనెల రూ.3వేల జీవన భృతి, పేదలకు ఇండ్ల స్థలాలు, ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ.15లక్షలు, స్వయం సహాయక మహిళా సంఘాలకు సొంత భవనాలు, మైనారిటీల సంక్షేమానికి రెసిడెన్షియల్ కాలేజీలను ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయనుందన్నారు. ఇప్పటికే దళితబంధు పథకంలో నియోజక వర్గంలోని 100మందికి ఒక్కొక్కరికీ రూ.10లక్షల చొప్పున స్వయం ఉపాధి కోసం యూనిట్లను ఏర్పాటు చేశారని అన్నారు. ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, మహారాష్ట్ర పార్టీ ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్ రావు, కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, సర్కిల్ అధ్యక్షుడు జితేందర్రెడ్డి, జేఏసీ వెంకన్న, హుడా మాజీ డైరెక్టర్ వీరేషం యాదవ్, కృష్ణాగౌడ్, శ్రీనివాస్గౌడ్, అనిల్కిశోర్, నర్సింగరావు, సంతోష్, ప్రభాకర్, పుదారి కన్న, రామకృష్ణ, మల్లేశ్, సాయి, జనార్దన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నేరేడ్మెట్, అక్టోబర్ 27: బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వెంట ప్రజలంతా నడువాలని బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. నేరేడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డితో కలిసి పర్యటించారు. ముందుగా నేరేడ్మెట్, ఎస్వీనగర్, ఇందిరానగర్, జేజేనగర్, భగత్సింగ్నగర్, కిందిబస్తీ, ఎరుకలబస్తీలలో ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో పాల్గొని పలువురిని బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించారు. అనంతరం ఇంటింటికీ ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడుతూ అభివృద్ధిని కాంక్షించే వారందరూ కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ వచ్చిన తరువాత మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని ఏ ప్రాంతానికి వెళ్లిన తాగునీటి కొరత వలస మహిళలు ఖాళీ కుండలతో గొడవలు పడేవారని, కరెంట్ కొరత కారణంగా పరిశ్రమలు కుంటుపడ్డాయని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టడం వలన తెలంగాణ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయిందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను ఆశీ ర్వదించాలని కోరారు.