తెలంగాణ తొలి శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు బాలాపూర్ మండలం నాదర్గుల్లోని మాతృదేవోభవ ఆశ్రమంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది అభాగ్యుల మధ్య తన పుట్టినరోజును జరుపుకోవడం సంతోషంగా ఉందని, అభాగ్యులకు ఆశ్రయమిస్తున్న గట్టు గిరి సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించి, కొత్త బట్టలు పంపిణీ చేశారు. బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి, కార్పొరేటర్లు శ్రీధర్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, మర్రి శశాంక్రెడ్డి, మర్రి జగన్మోహన్రెడ్డి, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు రవీంద్రాచారి, వెంకటాచారి, మధుమోహన్చారి, చంద్రమోహన్, జగదీశ్వర్చారి, వేణుగోపాలచారి, సుదర్శన్చారి, వేణుగోపాలచారి, కేశవచారి పాల్గొన్నారు.