Azharuddin | గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదించిన అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్ అయింది. అజారుద్దీన్, కోదండరాం అభ్యర్థిత్వాలను ఆమోదిస్తూ ఫైల్పై గవర్నర్ శివ్ ప్రతాప్ సంతకం చేశారు. దీనిపై త్వరలో గెజిట్ నొటిఫికేషన్ విడుదల కానుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై గత మూడేళ్లుగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే.
గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీలుగా నియామకమైన మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సేవలో వారి అనుభవం, రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదపడతాయని విశ్వసించారు. శాసన మండలిలో వారి సేవలు ప్రజల ఆశయాలకు అనుగుణంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కొంత కాలంగా ఈ ఇద్దరి ఎమ్మెల్సీల నియామకం పెండింగ్లో ఉండడంతో తాజాగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల వారి నియామకంపై ఆమోదం తెలపడం వారికి ధన్యవాదాలు తెలిపారు.
Scientists Mysterious Deaths | చైనాలో శాస్త్రవేత్తలు మృతి, అమెరికాలో అదృశ్యం.. అసలేం జరుగుతోంది?
Pappu Yadav | 70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్ చూస్తారు: పప్పు యాదవ్
Arrest | కిడ్నాప్, హత్య కేసులో బెయిల్.. ఆపై పరార్.. 31 ఏళ్ల నాటి కేసులో పట్టుబడ్డ నేరగాడు..!