Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత నాలుగైదు రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. గురువారం ఉదయం నుంచి భానుడి భగభగలకు నగర ప్రజలు మండిపోయారు. కానీ సాయంత్రం సమయానికి ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది.
అయితే రాజేంద్రనగర్లోని ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలిని రాజేంద్రనగర్ డీసీపీ గురువారం సాయంత్రం పరిశీలించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని ఆయన తెలిపారు.