సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. సోమవారం రాత్రి 10గంటల వరకు నగరంలోని షేక్పేటలో అత్యధికంగా 3.9సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
అల్పపీడనం ప్రభావంతో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.4డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.8డిగ్రీలు, గాలిలో తేమ 55శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.