ఎల్బీనగర్ జోన్బృందం, ఏప్రిల్ 27: తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైటెక్స్లో నిర్వహించిన ప్లీనరీలో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశానికే ఆదర్శంగా పాలన సాగుతోందన్నారు. పార్టీ శ్రేణులంతా ఐకమత్యంగా ఉంటూ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు చేరవేసి వారితో మరింత మమేకం కావాలన్నారు. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తిరుగులేని శక్తిగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
జెండా పండుగలు..
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల పార్టీ అని టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు పీచర వెంకటేశ్వర్రావు అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దిల్సుఖ్నగర్లో పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీఆర్ఎస్ నాయకులు బబ్బురి ఆనంద్కుమార్ గౌడ్, గండి సన్నీయాదవ్, అనంతుల ప్రహ్లాద్, దూసరి కృష్ణ గౌడ్, శ్రావణ్కుమార్ గుప్తా, చంద్రశేఖర్, వెంకటేశ్, విక్రాంత్, తదితరులు పాల్గొన్నారు.
లింగోజిగూడ డివిజన్లో..
లింగోజిగూడ డివిజన్ పరిధిలోని ఎంఎన్ఆర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ జెండాను మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్రావు అవిష్కరించారు. నాయకులు ఆడాల యాదయ్య, నర్రె శ్రీనివాస్ కురుమ, భాస్కర్, పర్శపు శ్రీధర్, నర్సింహ, శ్రావణ్కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
చైతన్యపురి డివిజన్లో..
తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి ముద్డగౌని రామ్మోహన్ గౌడ్ ఆవిష్కరించారు. నాయకులు పవన్, త్రివేది, సుదర్శన్రెడ్డి, గట్టు శ్రీనివాస్, రమణారెడ్డి, పోచిరెడ్డి, మున్నా పటేల్, విజయరంగ, జాఫర్, వీరన్నయాదవ్ పాల్గొన్నారు. ఫణిగిరి కాలనీలో టీఆర్ఎస్ పార్టీ జెండాను టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు శివప్రకాశ్ ఆవిష్కరించారు.
మన్సూరాబాద్లో..
మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ చౌరస్తా, శ్రీరామ్నగర్కాలనీ చౌరస్తా, ఇందిరానగర్, వినాయక్నగర్, హయత్నగర్ బొమ్మలగుడి, వీరన్నగుట్ట కాలనీల్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి హాజరై టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, జక్కిడి రఘువీర్ రెడ్డి, పోచబోయిన జగదీశ్యాదవ్, టంగుటూరి నాగరాజు, రుద్ర యాదగిరి, నర్రి వెంకన్న కురుమ, అత్తాపురం రాంచంద్రారెడ్డి, సిద్దగౌని జగదీశ్గౌడ్, బాలరాజు గౌడ్, పారంద నర్సింగ్రావు, రాంకోటి, కంచర్ల రాకేశ్రెడ్డి, ధనపాల్ గౌడ్, కేశబోయిన నగేశ్యాదవ్, కోదండ సురేశ్, అనిల్కుమార్, సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో..
మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మి ఆధ్వర్యంలో లెక్చరర్స్కాలనీలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి హాజరై టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కొసనం వెంకట్రెడ్డి, పుణ్యారెడ్డి, రఘునాథ్రెడ్డి, వెంకట్రెడ్డి, ఆనంద్గౌడ్, కేకేఎల్ గౌడ్, భిక్షపతి, మల్లయ్య, ధనలక్ష్మి, శ్యామల, మంజుల, నవ్య, తదితరులు పాల్గొన్నారు.
నాగోల్ డివిజన్లో..
నాగోల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత హాజరై టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
వనస్థలిపురంలో..
బీఎన్రెడ్డినగర్లో డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొంగర మహేశ్, గంగం శివశంకర్ పాల్గొన్నారు.
హస్తినాపురంలో…
హస్తినాపురం టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారి ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా, డీఆర్ఎల్ కాలనీ చౌరస్తా, నందనవనం, భూపేశ్గుప్తానగర్, ఖాద్రి కాలనీ, రోషన్దౌలాల్లో గులాబీ జెండాను ఆవిష్కరించారు. మాజీ కార్పొరేటర్ పద్మానాయక్, డేరంగుల కృష్ణ, పాషా, పెద్ద కృష్ణ, శ్రీనివాస్యాదవ్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చంపాపేటలో..
చంపాపేట డివిజన్ పరిధిలో మారుతీనగర్కాలనీలో, చంపాపేట సీపీఎస్ స్కూల్ ఆవరణలోని టీఆర్ఎస్ జెండాను టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్కుమార్రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సుంకోజు కృష్ణమాచారి, తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ప్లీనరీకి తరలిన టీఆర్ఎస్ శ్రేణులు
నగరంలో జరుగుత్ను టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కత్తుల రాంబాబు ఆధ్వర్యంలో గొల్ల సతీశ్యాదవ్, జహీర్ఖాన్, కటికనేని శ్రీధర్, అశోక్, మల్లెపాక యాదగిరి తదితరులు తరలివెళ్లారు.