కేసీ తండా చెరువు కట్టపై శివుడి విగ్రహ ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన
మహేశ్వరం,ఏప్రిల్25: చెరువులు కలుషితం కాకుం డా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. సోమవారం కేసీతండా చెరువు కట్ట వద్ద రూ.25లక్షల సొంతనిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్న 30 అడుగుల శివుడి విగ్రహానికి సర్పంచ్ మోతీలాల్ నాయక్తో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీ తండా చెరువును పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని ఆమె అన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ పాండు యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజునాయక్, శివగంగ ఆలయ చైర్మన్ సుధీర్గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు యాదయ్య, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ, డైరెక్టర్లు ప్రభాకర్, అశోక్కుమార్, నాయకులు చంద్రయ్య ముదిరాజ్, వీరానాయక్, లావణ్య లింగం,రాజేశ్,రవీందర్, శ్రీనివాస్రెడ్డి, నవీన్, మైసయ్య పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి సీఎం పెద్దపీట
బడంగ్పేట: ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి అన్నారు. మీర్పేట కార్పొరేషన్ పరిధిలోని ఎస్ఎల్నెస్ కాలనీలో ఉన్న లక్ష్మీనర్సింహాస్వామి చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ కమిటీ సభ్యులు ఆమెను సత్కరించారు.కార్యక్రమంలో మే యర్ దుర్గాదీప్లాల్, డిప్యూటీ మేయర్ విక్రంరెడ్డి, పా ర్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేశ్గౌడ్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు,కమిటీసభ్యులు ఉన్నారు.
టీఆర్ఎస్తోనేఅభివృద్ధి సాధ్యం
బడంగ్పేట, ఏప్రిల్23: టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి సబితా రెడ్డి అన్నారు. బడంగ్పేట కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంరెడ్డి, మాజీ కౌన్సిలర్లు యాద య్య, కుమార్గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం కార్పొరేషన్ పరిధిలోని నాదర్గూల్ 8వ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో సోమవారం మంత్రి సమక్షంలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి మంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు.అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసేలా పథకాలకు రూపకల్పన చేశారన్నారు. గడప గడపకు మిషన్భగీరథ నీరు ఇచ్చి నీటి కష్టాలను దూరం చేశారని అన్నారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జంగయ్య, సాయి, శ్రీధర్, సామ నిశికాంత్ రెడ్డి, సురేశ్ యాదవ్ పాల్గొన్నారు.