సమ్మెలో భాగంగా ర్యాలీలు, పరిశ్రమల మూసివేత
చర్లపల్లి, మార్చి 28 : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సోమవారం చర్లపల్లి పారిశ్రామికవాడలో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి.. పరిశ్రమలను మూ సివేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షుడు సాయిబాబు మాట్లాడుతూ.. దేశంలో అన్ని వర్గాలవారిని మోసం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని, రెండవసారి అధికారం లోకి వచ్చిన అనంతరం పేదలు, కార్మికులు, రైతులను విస్మరించి కా ర్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. నిత్యావసర వస్తువులు, చమురు ధరలను పెంచడంతో పాటు కార్మికులను మోసం చేసే విధంగా చట్టాలను రూపొందించారని, వాటిని వెంటనే రద్దు చేసేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మేడ్చ ల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, యూనియన్ నాయకులు బీవీ సత్యనారాయణ, శ్రీనివాసులు, శ్రీనివాస్రావు, ఏఐటీయూసీ నేత శంకర్రావు, టీఎన్టీయూసీ నేత ప్రసాద్బాబు, తిరుమల రాజు, నర్సింహ, మణికంఠ, బాల్రాజు, శ్రీనివాస్, మునిస్వామి, ఆదామ్, సంతోశ్, వసంత్రావుతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
పరిశ్రమ ముందు ఈసీఐఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళన చేపట్టారు. కార్యక్రమం లో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఎస్ బోస్, సీఐటీయూ నాయకుడు సాయిబాబా, సీపీఎస్టీయూ చైర్మన్ రాఘవరావు, యూ నియన్ ప్రధాన కార్యదర్శి జీవీఆర్వీ ప్రసాద్, నాయకులు ప్రవీణ్, జోషికుమార్, బాలకృష్ణ, మహిపాల్, నాగబాబు, పవన్కుమార్, డేవిడ్ రాజ్, విజయ్కుమార్, రాజశేఖర్, అజయ్కుమార్, అంజన్కుమార్, షాకీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఈసీఐఎల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్, వీవీ రెడ్డి, సీహెచ్వీ ప్రసాద్, ఇమాన్యుయల్, జీవై రావు, కృష్ణ, సోమయ్యచారి, సాయి, హెచ్వీ స్వామి, విల్సన్, శాస్త్రీ, మురళి, రవీంద్రనాథ్, రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్, మార్చి 28 : జాతీయ సమ్మెలో భాగంగా సోమవారం టీఆర్ఎస్ కార్మిక విభాగం, సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు తిప్పని సంపత్కుమార్, ఎర్రం శ్రీనివాస్, వెంకన్న, కనకయ్య, కార్యకర్తలు పెద్ద ఎత్తున రామంతాపూర్ అరవింద్నగర్ టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు బాలకుమార్, సైదులు మేస్త్రి, మైకెల్ రాజు, నగేశ్, యాదగిరి రెడ్డి, వినోద, నాగరాజు, విజయ్, అశోక్రెడ్డి, ఎండీ గౌస్, భీష్మాచారి, మధు, తదితరులు పాల్గొన్నారు.