బాలానగర్, అక్టోబర్ 18 : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముచ్చటగా మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం పక్కా అని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం బాలానగర్ డివిజన్కు చెందిన బూత్ కమిటీ సభ్యుల సమావేశం సామ్రాట్ ప్రెసిడెన్సీలో నిర్వహించారు. ఈ సమావేశానికి వినాయక్నగర్, సాయినగర్లకు చెందిన 11 బూత్లకు చెందిన బూత్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడులూ.. కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేసిన అభివృద్ధే ఆయన గెలుపుకు నాంది పలుకుతాయని తెలిపారు. బాలానగర్ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. బూత్ కమిటీ సభ్యులు అంకితభావంతో పని చేసి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దర్శనం శాకయ్య, మందడి సుధాకర్రెడ్డి, అంబటి సునిల్కుమార్, ఖాజా, రత్నం, మహేందర్రెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మూసాపేట, అక్టోబర్18: కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాదవరం కృష్ణారావు గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం డివిజన్ పరిధిలోని భరత్నగర్ ఈడబ్ల్యూఎస్, మూసాపేట ఓల్డ్ విలేజ్, అంబేద్కర్ నగర్, బాబు జగ్జీవన్రామ్ బస్తీలకు చెందిన బూత్ కమిటీల సభ్యులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డివిజన్ పరిశీలకుడు మాజీ కార్పొరేటర్ నరేంద్ర ఆచార్య, డివిజన్ అధ్యక్షడు అంబటి శ్రీనివాస్, సీనియర్ నాయకుడు కర్క పెంటయ్య, కర్క స్వామి, రమేశ్యాదవ్, వెంకటేశ్గౌడ్, జెల్ల రాము, నాని బూత్ స్థాయి కర్యకర్తలు పాల్గొన్నారు.
కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 18 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదిన్నరేండ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు చెప్పాలని బీఆర్ఎస్ను గెలిపించేందుకు బాధ్యతగా పనిచేయాలని మాజీ కార్పొరేటర్ పగుడాల బాబూరావు అన్నారు. బుధవారం హబీబ్నగర్, ప్రగతినగర్లలో బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాధవరం కృష్ణారావు భారీ విజయాన్ని సాధించడం ఖాయమని పేర్కొంటూ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి భారీ మెజార్టీని అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షుడు గౌసుద్దీన్, స్థానిక నేతలు అహ్మద్, ముస్తఫా ఉన్నారు.