KTR | ముషీరాబాద్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త సురేందర్ అనారోగ్యంతో ఉన్నారని ఆయన కొడుకు ఉమాశంకర్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారని తెలిసిందే. దీనికి కేటీఆర్ స్పందిస్తూ సురేందర్ను త్వరలోనే కలుస్తాను అని మాట ఇచ్చారు.
ఇచ్చిన మాట మేరకు కేటీఆర్ ఈ రోజు ముషీరాబాద్ వెళ్లి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేందర్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని, కుటుంబ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసాయం అందించాలని డాక్టర్లకు సూచించిన కేటీఆర్ సురేందర్ కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఉన్నారు.
అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు సురేందర్ను పరామర్శించి, చికిత్స కోసం ఆర్ధిక సహాయం చేసిన కేటీఆర్ pic.twitter.com/JB3ZwmS5EB
— Telugu Scribe (@TeluguScribe) May 24, 2026
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ముషీరాబాద్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త సురేందర్ గారు అనారోగ్యంతో ఉన్నారని వారి కొడుకు ఉమాశంకర్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా రామన్న దృష్టికి తీసుకువచ్చారు.
సురేందర్ గారిని త్వరలోనే తనను కలుస్తాను అని… pic.twitter.com/BZ0wlJOwPB
— BRS Party (@BRSparty) May 24, 2026