సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : రాజధాని వాసుల కష్టాలు తీర్చే వరకూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని వదిలిపెట్టరని, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ రేషన్ కార్డులు, ఫించన్లు, ఇళ్లు ఇచ్చే వరకూ పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అయిన హైదరాబాద్ ఏడాదికాలంగా సమస్యల సుడిగుండంలో చికుకుందన్నారు. సీఎంగా కేసీఆర్ సారధ్యంలో హైదరాబాద్ సంతోషానికి చిరునామాగా ఉంటే.. నేడు రేవంత్ సరార్ పాలనా వైఫల్యంతో సవాలక్ష కష్టాలకు కేరాఫ్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో మంగళవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ ప్రజలు ఏడాది కాలంగా నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు ఎదురొంటున్న పారిశుద్ధ్య ఇబ్బందులను, తాగునీటితో పాటు ఇతర సమస్యలను ఎమ్మెల్యేలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఎండాకాలం రాకముందే అనేక ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లు దర్శనమిస్తున్న సంగతిని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
వేళా పాళా లేని కరెంటు కోతలతో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. దీంతో పాటు బీఆర్ఎస్ పాలనలో సేఫ్ సిటీకి బ్రాండ్గా ఉన్న హైదరాబాద్, క్రైమ్ సిటీగా మారడం, మళ్లీ పెరుగుతున్న భూకబ్జాలతో పాటు గాలికొదిలేసిన లా అండ్ ఆర్డర్ తో నగర ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న అభద్రతాభావంపై కేటీఆర్తో ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సమస్యల పరిషారం, నగర ప్రజలకు కలిగించాల్సిన భరోసాపై ఎమ్మెల్యేలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అమలు కావడం లేదు
బీఆర్ఎస్ పాలన హైదరాబాద్ నగరానికి స్వర్ణయుగం అని, మెట్రో రైలు, సివరేజీ ప్రాజెక్టులు, ఐటీ వృద్ధి, ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు నగర రూపురేఖల్ని మార్చి దేశానికే గర్వకారణంగా హైదరాబాద్ను తీర్చిదిద్దామని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ అమలు చేసిన సమగ్రమైన ప్రణాళికలతో హైదరాబాద్లో శాంతిభద్రతలు చెకుచెదరకుండా ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని కాపాడాలన్న సోయి కూడా లేకపోవడం దురదృష్టకరం అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజక వర్గంలో ఏ కార్యక్రమానికి వెళ్లినా కాంగ్రెస్ పాలనలో ఎదురొంటున్న దురవస్థ గురించే హైదరాబాదీలు చెబుతున్నారని ఎమ్మెల్యేలు కేటీఆర్కు వివరించారు. ప్రధానంగా బస్తీ వాసులు సమస్యల సుడిగుండంలో చికుకుని విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ కూడా హైదరాబాద్లో అమలు కావడం లేదన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఏడాది కాలంగా హైదరాబాద్లోని పేదలు ఎదురు చూస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయంలో హైదరాబాద్ రూపురేఖల్ని సమూలంగా మార్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.
రోజురోజుకూ సమస్యలు పెరిగిపోతున్నాయి
హైదరాబాద్ వాసుల విలువైన సమయాన్ని ఆదా చేసే విధంగా వందేళ్ళ ముందు చూపుతో పెద్ద ఎత్తున ఫె్లైఓవర్ల నిర్మాణం చేపట్టామని, కరోనా సమయంలో కూడా యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తిచేసి ఫె్లైఓవర్లు, అండర్ పాస్లను హైదరాబాదులో వాసులకు అందుబాటులోకి తెచ్చామని కేటీఆర్ తెలిపారు. కొత్త రహదారుల నిర్మాణం, లింక్ రోడ్ల నిర్మాణంతో రద్దీ సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల్ని తీర్చి హైదరాబాద్ వాసుల అభిమానాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సంపాదించుకుందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వానికి తాము నిర్మించిన కట్టడాలు, నిర్మాణాల నిర్వహణ కూడా చేతకావడం లేదని కేటీఆర్ విమర్శించారు. దెబ్బతిన్న రోడ్లను కనీసం రిపేర్ చేయకపోవడంతో వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడడంతో పాటు ట్రాఫిక్ కష్టాలు నిత్యకృత్యమయ్యాని మండిపడ్డారు. చెత్త సమస్యను పరిషరించేందుకు హైదరాబాద్లో ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆటోల ప్రయోగంతో విప్లవాత్మకమైన ఫలితాలను సాధించగలిగామని కేటీఆర్ చెప్పారు. కానీ నేడు హైదరాబాద్ లోని ఏ కాలనీ కి వెళ్లి చూసినా ఎకడికకడ చెత్త పేరుకుపోయి కనిపిస్తున్నదన్నారు. ఫలితంగా ఈగలు, దోమల సమస్య పెరిగి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్కు పాలన చేతకాదనే నిజం హైదరాబాద్ వాసులకు పూర్తిగా అర్థమైంది
బీఆర్ఎస్ హయంలో కంచెలు వేసి కాపాడిన ప్రభుత్వ పారులకు కూడా రేవంత్ సరార్ పాలనలో రక్షణ లేకుండా పోయిందని, అనేకచోట్ల కబ్జాలకు గురయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా సామర్థ్యంపై హైదరాబాద్ ప్రజలకు నమ్మకం లేదన్న కేటీఆర్, ఆయనకు పాలన చేతకాదనే నిజాన్ని హైదరాబాద్ వాసులు పూర్తిగా అర్థం చేసుకున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో కుల,మత, ప్రాంతాలకు అతీతంగా హైదరాబాదీలంతా పదేళ్ల అభివృద్ధికి పట్టం కట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను భారీ మెజారిటీలతో గెలిపించారని, హైదరాబాద్ ప్రజల నమ్మకానికి అనుగుణంగా వారి కష్టాలను తీర్చడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. హైదరాబాద్ వాసుల కష్టాలు తీర్చేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. రాష్ట్రానికి ఎకనామిక్ ఇంజన్ అయినా హైదరాబాద్ ఇమేజీ కాంగ్రెస్ పాలనలో దారుణంగా దెబ్బతిన్నదని, ఇది కేవలం హైదరాబాద్కే కాకుండా యావత్ రాష్ట్రానికి మంచిది కాదన్నారు.
అభివృద్ధిని గాలికొదిలేసిన కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు
పదేళ్లపాటు దేశంలోనే మోస్ట్ లవబుల్ సిటీగా, లివబుల్ సిటీగా అనేక ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ర్యాంకింగ్ లో అగ్రభాగాన నిలిచిన హైదరాబాద్ గాడితప్పిన పాలన కారణంగా నేడు విలవిలలాడుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రోత్ ఇంజన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. గ్రామసభలు, వార్డు సభల పేరిట మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సరారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు, పింఛన్లు ఇవ్వాలని, లేకపోతే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఊరుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణకు వెన్నుముక అయిన హైదరాబాద్ అభివృద్ధిని గాలికొదిలేసిన కాంగ్రెస్ సరారుకు నగర ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.