రూ.15 కోట్లతో భారీ సదుపాయాల భవనం
తీరనున్న రైతులు, వినియోగదారుల కష్టాలు
నేడు ప్రారంభించనున్న మంత్రులు నిరంజన్రెడ్డి, హరీశ్రావు, మల్లారెడ్డి
కేపీహెచ్బీ కాలనీ, మార్చి 26 : ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా గుర్తింపు పొందిన కేపీహెచ్బీ కాలనీలో మోడల్ రైతుబజార్ ప్రారంభానికి ముస్తాబయింది. ఆదివారం మంత్రులు నిరంజన్రెడ్డి, హరీశ్రావు, చామకూర మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్కుమార్ తదితరులు హాజరై రైతుబజార్ను ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరంలో మొదటగా ఎర్రగడ్డలో మోడల్ రైతుబజార్ను ఏర్పాటు చేయగా, కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో రెండో రైతుబజార్ను ఏర్పాటు చేశారు.
కూకట్పల్లి (కేపీహెచ్బీ కాలనీ) రైతుబజార్ పున:నిర్మాణ పనులకు 2018 జూలై లో మంత్రి హరీశ్రావు శిలాఫలకం వేశారు. సుమారు రూ.15 కోట్లతో సెల్లార్ ప్లస్, జీ ప్లస్ 1 భవనంలో సకల సౌకర్యాలు ఉండేలా రైతుబజార్ను నిర్మించారు. గ్రౌండ్ఫ్లోర్లో రైతులకు 158 స్టాళ్లు, స్వయం సహాయక సంఘాలకు 65 స్టాళ్లు, 18 దుకాణాలు ఉన్నాయి. మొదటి అంతస్తులో రైతులకు 148, స్వయం సహాయక సంఘాలకు 77 స్టాళ్లతో పాటు 5 దుకాణాలు ఉన్నాయి. రైతుబజార్లో 471 స్టాళ్లతో పాటు సకల సౌకర్యాలు ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ రైతుబజార్ నిర్మాణానికి సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులందరికీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ ప్రత్యేకతలు