తలంబ్రాలు, పట్టు వస్ర్తాలను సమర్పించిన రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్
కీసర, ఏప్రిల్ 27; చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగిం ది. బుధవారం స్వామివారి కల్యాణ మహోత్సవం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. ఈ కల్యా ణ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ దంపతులు, మాజీ ఫాప్ చైర్మన్ మనాలి రాజ్ఠాగూర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
స్వా మివారి కల్యాణ వేడుకలను యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామికి చెందిన వేదపండితుల ఆధ్వర్యంలో జరిపించారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు భిక్షమయ్యగౌడ్, రాంచందర్రావు, బీజేపీ రాష్ట్ర నాయకుడు కొంపల్లి మోహన్రెడి విచ్చేసి స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్, ఆలయ ధర్మకర్త శ్రీహరిగౌడ్ ప్రముఖులను సత్కరించారు.